రాజీవ్ గాంధీ మీద జరిగిన హత్యాకాండను ఎవరూ హర్షించరు కానీ అది జరిగి 23 సంవత్సరాలైంది. ముద్దాయిలుగా నిరూపించబడ్డవారు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్నారు. ఇప్పుడు వారిని ఉరితియ్యటంతో కలిగే లాభమేమిటి. మరణ శిక్షలను ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న కాలంలో ఇంకా ఉరి శిక్షను వెయ్యమని కేంద్ర ప్రభుత్వం కోరటమేమిటి.
దేశ ప్రధాన మంత్రిని చంపటం ఆమోదయోగ్యం కాదు. అలాంటి హింసాకాండలను ఉపేక్షించగూడదు కానీ వాళ్ళకి ఉరిశిక్ష వేస్తేనే న్యాయం చేసినట్లు కాదు కదా! వాళ్ళు కోరిన క్షమాభిక్షను పరిశీలించటంలో రాష్ట్రపతి కార్యాలయంలో జాప్యం జరగటంతో అటువంటి కేసులలో సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి ముద్దాయిలు తమ శిక్షను తగ్గించమని వేడుకోగా సుప్రీం కోర్టు అందుకు ఒప్పుకోవటం జరిగింది. దాన్ని వ్యతిరేకించటం కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం? దేశపాలన చూడవలసిన యంత్రాంగం మాజీ ప్రధాని హంతకుల మీద దృష్టి సారించటం, సుప్రీం కోర్టు తీర్పు మీద సవాల్ చెయ్యటం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఉరిశిక్షవెయ్యమని అడగటం ఎందుకు జరుగుతోంది?
విపక్షాలకు చెందిన నాయకుడి విషయంలో జరిగుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పట్టుబట్టేదా? ఒకవేళ భాజపా అధికారంలోకి వస్తే ఈ కేసులో నేరస్తులకు ఉరిశిక్ష కోసం పోరాడుతుందా? జరగదు! అంటే, అధికారం కాంగ్రెస్ దైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న గాంధీ కుటుంబ సభ్యులకు స్వాంతన చేకూర్చటం కోసం చేస్తున్న ప్రయత్నంలా కనిపించటం లేదూ? విషయం అది కాకపోయినా సుప్రీం కోర్టు తీర్పుకే వదిలిపెట్టి ఉంటే బావుండేది కదూ!
ఇదిలా ఉండగా జయలలిత నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ఆ దోషులను వదిలిపెట్టటానికి ఆత్రుత చూపించటం మరీ విడ్డూరంగా ఉంది. తనకి శాసనసభలో కరుణానిధి వలన అవమానం జరిగిందన్న కసిని ముఖ్యమంత్రైన తర్వాత మార్షల్స్ చేత నడిరోడ్డు మీద పంచె వూడేట్టుగా కరుణానిధిని నడిపించుకుంటూ తీసుకెళ్ళిన సంఘటనను ఎవరూ మర్చిపోరు.
మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అలాగే ఉండవచ్చు కదా! సుప్రీం కోర్టు తీర్పు రాగానే రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చెయ్యటానికి ఉత్సాహాన్ని చూపించటం ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కాంగ్రెస్ కి చెందిన నాయకురాలు కాకపోవటం వలనే కదా!
ఇప్పటికైనా రాజకీయనాయకులు కోర్టు పని కోర్టు చేసుకునేట్లుగా వదిలిపెట్టటం, అందులో కలుగజేసుకోకపోవటం ప్రజాప్రయోజనదృష్టిలో శ్రేయస్కరం అవుతుంది.
తమిళనాడు ప్రభుత్వం నేరస్తులను వదిలిపెట్టటానికి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద విచారణను సుప్రీం కోర్టు మార్చి 26 కి వాయిదా వేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more