ఆంద్రప్రదేశ్ లో గవర్నర్ గా ఉండి, మలి వయస్సులోనూ రాసలీలు జరిపి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి నుండి వైదొలిగిన ఎన్డీ తివారీ పితృత్వం కేసులో దిగొచ్చారు. రోహిత్ శేఖర్ నా కుమారుడే అని తివారీ (89) ఒప్పుకున్నారు. తివారీ పితృత్వం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా శేఖర్ తన కుమారుడు కాదంటూ తివారీ వాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శేఖర్ కోర్టును ఆశ్రయించి తివారీ తన తండ్రే అని పోరాటం చేశారు.
తండ్రి కొడుకుల మద్య పోరాటం ఇలా సాగింది...
ఎన్డీ తివారీ.. మలి వయసులో ముదిరి రొమాన్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. 89 ఏళ్ల తివారి పై 32 యువకుడు కేసు పెట్టాడు. తివారి తొందరపాటు ప్రయోగంలో జరిగిన ఫలితమే ..ఈ 32 ఏళ్ల రోహిత్ శేఖర్. తివారీ తన తండ్రే అంటూ 32 ఏళ్ల యువకుడు సాగించిన పోరాటంలో చివరగా విజేతగా నిలిచాడు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ దత్ తివారీ పితృత్వ కేసు సుఖాంతం అయ్యింది. 2008లో రోహిత్ శేఖర్ అనే వ్యక్తి తన తండ్రి తివారీ అంటూ కోర్టులో కేసు వేశాడు. అప్పటి నుండి తివారీ మాత్రం రోహిత్ కు తనకెలాంటి సంబంధం లేదంటూ చెబుతూ తప్పించుకుంటూ వస్తున్నాడు.
రోహిత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూ వచ్చారు. 2012 సంవత్సరంలో డిఎన్ఏ పరీక్షకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తివారీ కూడా కోర్టు మెట్లు ఎక్కారు. రక్త నమూనాలు ఇవ్వనని తివారీ మొండికేశారు. చివరకు కోర్టు మొట్టికాయలు వేయడంతో రక్త నమూనాలు ఇచ్చారు. కానీ ఆ నివేదికను రహస్యంగా ఉంచాలంటూ తివారీ సుప్రీంకోర్టును అభ్యర్థించాడు.
అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. తివారీ నుండి సేకరించిన రక్తనమూనా నివేదికను బట్టి రోహిత్ శేఖర్ తండ్రి తివారేనని తేలిపోయింది. చివరకు తన కుమారుడు రోహిత్ అని తివారీ ప్రకటించడంతో తండ్రి కొడుకుల పోరాటానికి తెరపడింది. దీంతో రోహిత్ శేఖర్ ఆనందంతో న్యాయమే గెలిచిందని తన సన్నిహితులతో చెబుతున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more