ఎన్నో రకాలుగా ఆలోచించి, సన్నిహితులతో మంతనాలు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చివరకు కొత్త పార్టీ పెట్టటానికే నిశ్చయించుకున్నట్లుగా సమాచారం.
అధిష్టానాన్ని ఢీకొంటూ, దేనికీ వెరవని, తనతో పాటు కదం కలిపే తనదంటూ ఒక సేనను తయారు చేసుకోవటానికి కిరణ్ కుమార్ ఆదివారం చేసిన సుదీర్ఘమైన చర్చలలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.
రాష్ట్ర విభజన ప్రక్రియలో సాధనం కాదలచుకోని కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే రాజీనామా చెయ్యదలచుకున్నారు. అయితే బిల్లును ప్రవేశపెట్టారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్షమైన భాజపా కూడా బిల్లుని పార్లమెంటులో పెట్టలేదని అనటంతో మంగళవారం వరకు వేచి చూద్దామనుకుంటున్నారు. ఈ లోపులో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాధ్ బిల్లును కావాలంటే మరోసారి పెడతామని ప్రకటించారు.
ఇప్పుడు రాజీనామా చేస్తే విభజన బిల్లును పార్లమెంట్ లో పెట్టారని అంగీకరించనట్లవుతుందని కిరణ్ కుమార్ భావిస్తున్నారు. ఈ మాటను మంత్రి టి.జి.వెంకటేష్ మీడియాలో ధృవీకరించారు కూడా.
తెలుగు ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగానే కాదు, ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ప్రవర్తిస్తున్న ఒంటెద్దు పోకడల కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఇష్టం లేదని, అందుకే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యటంతో పాటుగా మౌలికంగా పార్టీ సభ్యత్వం నుండి కూడా వైదొలగాలని భావిస్తున్నానని కిరణ్ కుమార్ తను భేటీ అయిన నాయకులతో స్పష్టంగా తెలియజేస్తూ ఎవరి మద్దతు ఎంత ఉంటుందన్న విషయంలో బేరీజులు వేస్తున్నారు.
అయితే రాష్ట్ర విభజన జరిగినా జరగకున్నా కొత్త పార్టీ పెట్టటం ఖాయమని ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. బిల్లు మంగళ బుధవారాల్లో ప్రవేశపెట్టి చర్చకు తీసుకుని రావొచ్చని ఢిల్లీలో అనుకుంటున్నారని, అది ఎప్పుడు జరిగినా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యటమైతే ఖాయమని టిజి వెంకటేష్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more