ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ఈ మూడు రాష్ట్రలలో ఎన్నికల సమయంలో డబ్బు ప్రధానపాత్ర వహించిందని, అది ఈ మూడు దక్షణాది రాష్ట్రాలలో ఎక్కువ స్థాయిలో జరిగిందని పరిశీలనలో తేలినట్లుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ఈ సందర్భంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ పై మూడు రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు విపరీతమైన స్థాయిలో ఉండటమే కాకుండా డబ్బిచ్చి వేయించుకున్న వార్తా కథనాలు కూడా ఎక్కువ ప్రమాణంలో ఉన్నాయని అన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో సగం మంది అయిన ఖర్చుకంటే చాలా తక్కువ చూపించారని భన్వర్ లాల్ అన్నారు. కొన్ని వార్తా పత్రికలు, ఇతర మీడియా సాధనాలు రాజకీయ పార్టీలకు మద్దతుగా పనిచేసాయన్నారాయన.
ఎన్నికల ఖర్చుల నియంత్రణ, కొనుక్కునే వార్తల గురించి జరిగిన సమావేశంలో పై విధంగా భన్వర్ లాల్ మాట్లాడిన తర్వాత ఎన్నికల ఖర్చుల డైరెక్టర్ జనరల్ పి.కె.దాశ్ మాట్లాడుతూ, ఎన్నికలలో డబ్బు ఇవ్వటం కానీ పుచ్చుకోవటం కానీ నేరమౌతుందని, అటువంటి నేరానికి ఒక సంవత్సర కాలం వరకూ జైలు శిక్షకు అర్హులౌతారని, ఈ విషయంలో పౌరులలో అవగాహన రావటానికి మీడియా కృషిచేయాలని అన్నారు.
నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాలలో డబ్బు ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగాయని అన్న భన్వర్ లాల్ అస్సాంలాంటి రాష్ట్రాలో విలువలను పాటించారని అన్నారు. అక్కడి వోటర్లు డబ్బు ఇచ్చిపుచ్చుకోవటాన్ని వ్యతిరేకించారని చెప్పారు.
డబ్బు తీసుకుని అనుకూలమైన వార్తాకథనాలుగా ప్రజల ముందుకు తీసుకునివచ్చే మీడియా మీద వేటు ఉంటుందని దాశ్ హెచ్చరించారు. కొన్ని తిరుగుతూ పరిశీలించేవి మరి కొన్ని నిలకడ ఉండి జరుగుతున్న పరిణామాలను కనిపెట్టే బృందాలను ఎన్నికలలో ప్రవేశపెడుతున్నామని, దానితోపాటు మేజిస్ట్రేట్ లు కూడా ఈ పని కోసం నియమించబడుతున్నారని, దానితో డబ్బు, మద్యం ఎన్నికలలో పారటాన్ని అరికడతామని తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more