దేవయాని ఖోబ్రాగడె కేసులో భారత్ తో అమీతుమీలు జరిగి ఎలాగో తమ గౌరవానికి భంగం కలగకుండా అందులోంచి బయటపడ్డ అమెరికాకు మరో తలనొప్పి నరేంద్ర మోదీ రూపంలో బయటపడుతోంది.
గుజరాత్ లో 2002 లో జరిగిన నరమేధంలో కోర్టు నుంచి విముక్తి లభించినా, అమెరికా ప్రభుత్వం మాత్రం ఆ అల్లర్లకు బాధ్యుడిగా మోదీని గుర్తించి ఆయనకు వీసా ఇవ్వటానికి తిరస్కరిస్తూ వస్తోంది. అయితే దరిమిలా మోదీ భారతీయ జనతా పార్టీ తరఫునుంచి 2014 సాధారణ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థి కావటం, భారత్ లో పర్యటన చేస్తూ తన ప్రసంగాలతో ప్రసిద్ధికి ఎక్కుతుండటం, నాలుగు శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించటం గమనించిన అమెరికాకు మోదీ వీసా మరో సమస్యగా మారింది.
ఎన్నికలలో భాజపా అధికారంలోకి వచ్చినట్లయితే కాబోయ్ ప్రధాన మంత్రి మోదీయే అయిపోతారు. 2005 లో ఆయన వీసాను అమెరికా రద్దు చేసింది. అప్పుడు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైవుండటం వలన మోదీ వీసా తిరస్కరణ వలన పెద్దగా తేడా ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు జాతీయ నాయకుడిగా ఎదిగిన మోదీ విషయంలో మరోసారి భారత్ తో సంబంధాలలో ఎటువంటి చిక్కు వస్తుందోనని అమెరికా ప్రభుత్వం ఆలోచనలో పడింది.
పోయిన సంవత్సరం నవంబర్ లో కూడా మోదీ వీసా విషయంలో అంతకు ముందులాగానే వీసా తిరస్కరణకు తీర్మానం చెయ్యటం జరిగింది. ఇక ప్రధానమంత్రి గా ఎన్నికైనా, అమెరికా దేశం నుంచి మరి ఇతర దేశాల నుంచి కూడా మోదీకి అమెరికన్ వీసా జారీ చెయ్యటానికి అనుకూలంగా సమర్థన రాకపోవచ్చు. అయితే మోదీ మాటలను బట్టి ఆయన విదేశీ పెట్టుబడులకు భారత్ వాణిజ్య ద్వారాలను బార్లా తెరుస్తారని తెలుస్తోంది. కానీ ప్రధానమంత్రి హోదాకి వచ్చినా ఆయన గత జీవితంలోని అభియోగాల దృష్ట్యా వీసాకు అంగీకారాన్ని ఎలా ఇవ్వాలో తెలియటం లేదు అమెరికాకి.
దీనివలన మోదీ వీసా విషయంలో అమెరికా మరో సారి తలపట్టుకుంటోంది. వీసా ఇవ్వకపోతే భారత్ తో సంబంధాలు తెగిపోతాయి, ఇస్తే తన దేశంలో సమస్యలు ఎదురౌతాయి. ఇదీ అమెరికాకు పట్టుకున్న తలనొప్పి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more