సంక్రాంతి సమీపిస్తోందంటే చాలు.... కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాల హడావుడి మొదలవుతుంది. దీనిపై పోలీసులు ఎంత ని ఘావేస్తున్నా పందాల రాయుళ్లు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా పోలీసులతో కుమ్మక్కయి పందాలు యధేచ్ఛగా నిర్వహిస్తున్నారు. . పందాలను అడ్డుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు సైతం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు పందాలను ప్రోత్సహిస్తున్నారు.. ఈ పందాల నేపధ్యంలో వందలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం జనం రావడం విశేషం.
పలువు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు ఇక్కడకు చేరుకుంటున్నారు. . ఈ నేపథ్యంలో ఈ సారి కోళ్ల పందాలకు సుమారు 250 కోట్లు చేతులు మారనున్నాయని విశ్లేషకుల అంచనా. ఈ కోళ్ల పందాలను చూసేందుకు వచ్చేవారితో ఇప్పటికే రాజమండ్రి , కాకినాడ తదితర ప్రాంతాల్లోని లాడ్ఝీలు నిండిపోయాయి. సంక్రాంతి మొదలు కొని మూడు రోజులపాటు జరిగే ఈ పందాలు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంటాయి. వీటిని అడ్డుకోవద్దంటూ ప్రజాప్రతినిధుల నుండి పోలీసులకు వత్తిళ్లు రావడం సహజమైపోయింది.. అయితే ఇప్పడు తాజాగా రానున్న ఎన్నికలను ఆసరా చేసుకుని గ్రామీణులను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు కోళ్ల పందాలను అనువుగా మలచుకోవడం విశేషం.
ప్రాంతీయ భేధాలకు అతీతంగా పందెంరాయుళ్లు పోటీలను నిర్వహిస్తుంటారు. . పశ్చిమ గోదావరి జిల్లాలోని అయిభీమవరం, భీమవరం, ఉండి, మహదేవ పట్నం తదతర ప్రాంతాలు, తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం, రాజోలు, మామిడికుదురు తదితర ప్రాంతాల్లో పందాలు అధికంగా కొనసాగుతుంటాయి. . ఈ పందాల కోసం ప్రత్యేకంగా గ్రౌండ్ ను సిద్ధం చేసి, పార్కింగ్ సదుపాయాలను కూడా నిర్వాహకులు కల్పిస్తుంటారు. పైగా అక్కడ చిరుతిళ్లను, భోజనాలను సైతం ఏర్పాటు చేయడం విశేషం. పందాలలో పాల్గొనే కోళ్లను చాలా శ్రద్ధతో పెంచుతారు. ఇందు కోసం వేల రూపాయలను ఖర్చు చేస్తారు. ఖరీదైనా బాదం, పిస్తా వంటివి తినిపిస్తారు.. ప్రస్తుత ఎన్నికల సంవత్సరం నేపధ్యంలో జరుగు తున్న ఈ కోళ్ల పందాలు కేక పుట్టిస్తున్నాయి..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more