అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో నడిచే ఆమ్ ఆద్మీ పార్టీకి అంతకు ముందు ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా కేటాయించిన చీపురు చిహ్నం ఇప్పుడు పర్మనెంట్ అయింది. ఆ పార్టీని రాష్ట్ర రాజకీయ పార్టీగా గుర్తించిన ఎన్నికల కమిషన్ పర్మనెంట్ మాత్రమే కాకుండా ఆ ఎన్నికల చిహ్నాన్ని అదే పార్టీకి రిజర్వ్ చేయటం కూడా జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఆ చిహ్నం తమకు పర్మనెంట్ గా కేటాయించమని అర్థించటంతో ఎన్నికల కమిషన్ ఆ పని చేసింది. ఢిల్లీలో చీపురు సాధించిన విజయం దృష్ట్యా ఆ పార్టీ ఆ ఎన్నికల చిహ్నాన్ని తమ సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా కోరుకోవటం జరిగింది.
ఢిల్లీ నగరంలో రోడ్లను చీపురు ఊడుస్తూ, ఢిల్లీలో అవినీతనేది లేకుండా ఇలాగే ఊడ్చేస్తామనే సంకేతాలిచ్చిన ఆప్ రాష్ట్రనికి పరిమితమైన పార్టీ కాబట్టి ప్రస్తుతం ఆ పార్టీకి కేటాయించిన ఆ చిహ్నం ఢిల్లీ వరకే వర్తిస్తుంది. శేష భారతంలో చీపురు చిహ్నం స్వేచ్ఛగా ఏ పార్టీకైనా ఎన్నికల గుర్తు అవొచ్చు.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ చిహ్నంగా మరేదైనా చిహ్నాన్ని డిజైన్ చేయించుకోవచ్చు. కానీ కలిసొచ్చిన చీపురు చిహ్నాన్ని వదులుకోవటానికి కేజ్రీవాల్ సిద్ధంగా లేరు. అదే చిహ్నాన్ని ఇతర రాష్ట్రల్లో ఇతర పార్టీలు తీసుకునే ముందుగానే ఆప్ కూడా తమ పార్టీకి జాతీయ హోదా సంపాదించుకుని జాతీయ స్థాయిలో దాన్ని సొంతం చేసుకోకపోతే చీపురు గుర్తుని తన్నుకుపోవటానికి కొందరు సిద్ధమవుతున్నరని వార్తలందుతున్నాయి.
లాఫింగ్ బుద్ధాని పెట్టుకుని లాభాల బాటలో వెళ్ళేవాళ్ళని, శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని పెట్టుకుని సిరిసంపదలను సంపాదించినవాళ్ళని చూస్తే మరి మిగతావాళ్ళు కూడా వాటిని పెట్టుకుందామని చూడరా. అలాగే చీపురుకి కూడా మహర్దశ వచ్చింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more