సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ దగ్గర చేయదలచుకున్నసంకల్ప దీక్షకు అనుమతి లభించింది.
శాసన సభకు వచ్చిన తెలంగాణా బిల్లుకి వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు రెండు రోజులు దీక్ష చేసి తమ నిరసనను తెలియజేయదలచుకున్నారు. ఈ రోజు రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా శాసనసభకు చర్చకు రానుండటంతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నిరసన దీక్షలను సంకల్ప దీక్ష పేరుతో చేస్తున్నారు.
శుక్రవారం, శనివారం రెండు రోజులు చేసే ఎంపీల దీక్షకు డిసిపి కమలాసన్ రెడ్డి అనుమతిని జారీ చేస్తూ ఆ కార్యక్రమానికి కొన్ని షరతులు విధించారు.
1. నాయకులు చేసే ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
2. కార్యక్రమం కొనసాగిస్తున్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి ఎటువంటి విఘాతాలు కలిగినా, అనుమతిని రద్దు చెయ్యటం జరుగుతుంది.
3. దీక్షా సమయంలో చట్ట వ్యతిరేక చర్యలు జరిగి ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిన పక్షంలో అందుకు బాధ్యతను దీక్షను నిర్వహించేవారే స్వీకరించవలసివుంటుంది.
మొత్తానికి అధికార పక్షమే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సభలను నిర్వహించి దీక్షలను సాగించటానికి చేస్తున్న ప్రయత్నానికి అధికారికంగా అనుమతులు తీసుకుని చరిత్రనే సృష్టించారు మన రాష్ట్ర నాయకులు. ఇంతకు ముందు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన చెయ్యటం, రాజీనామాలతో బెదిరించటం, పార్టీ వీడిపోతామని చెప్పటమే కాకుండా చేసి చూపించటం చేసారు. అయితే ఇలా పకడ్బందీగా అనుమతులతో చెయ్యటం ఇదే మొదటిసారి.
కాకపోతే, పార్టీ విధానానికి పార్టీ సభ్యులే వ్యతిరేకంగా దీక్షలు చెయ్యటానికి పార్టీ అనుమతి కూడా ఉందా అని అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more