ఇప్పటి వరకు మనం అసెంబ్లీ, పార్లమెంట్ , రాజ్యసభ, లోక్ సభలలో , మన నాయకుల్ని అదుపు చేసే స్పీకర్లను చూసాం. కానీ ఇక నుండి రైతులకు ఉపయోగపడే స్పీకర్ ను మనం చూస్తాం. ఈ స్పీకర్ వల్ల మన రైతులు రాత్రి పూట హాయిగా ఇంట్లో నిద్రపోతారు. అంటే ఈ స్పీకర్ మాత్రం పందులను తరిమికొట్టే పనిలో బీజీగా ఉంటారు. అసలు విషయం ఏమిటంటే.. అడవి పందుల బెడదతో రైతులు పెద్దెత్తున నష్టపోతున్నారు. వాటిని అరికట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పొలం చుట్టూ ప్రహరీలను నిర్మిస్తే.. మరికొందరు ఫెన్సింగ్ వేసుకుంటున్నారు..ఇక చిన్నసన్నకారు రైతులు పంటల చుట్టూ బట్టలు కట్టి పంటలను కాపాడుకుంటు న్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నా అడవి పందుల బెడదను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ప్రతిఏటా పంట పొలాలకు అడవి పందుల బాధ అధికమవుతూ వస్తోంది.
భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఏఆర్) నివేదిక ప్రకారం రైతులు సాగుచేస్తున్న వివిధ పంటనలు జంతువులు(ఎలుకలు, అడవి పందు లు) ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, చెరుకు, వేరుశనగ తదితర పంటలను అడవి పందులు ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందులను చంపడం నేరం కావడంతో రైతులు వాటిని ఎలా నిలువరించాలో తెలియక తీవ్రంగా నష్టపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గొప్ప ముందడుగు వేసింది. అడవి పందులను అరికట్టేందుకు చేసిన పరిశోధనలు ఫలించాయి. కొత్తగా రూపొందించిన స్పీకర్ అనే పరికరాన్ని వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపం లోని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో చేపట్టిన ప్రయోగం వంద శాతం విజయవంతమైంది.
ఇది భారత వ్యవసాయ రంగంలో గొప్ప ముందడుగా రూపకర్త డాక్టర్ వాసుదేవరావు తెలిపారు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పక్షి శాస్త్ర విభాగం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్తగా డాక్టర్ వాసుదేవరావు పనిచేస్తున్నారు. ఐసిఏఆర్ ఇటీవల పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు(పిపిపి) కింద కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వయా లైఫ్ సైన్సెన్స్ అనే ప్రైవేటు సంస్థతో కలిసి పంట పొలాల్లో పక్షులు, జంతువుల బెడదను అరికట్టేందుకు పరిశోధనలు ప్రారంభించింది. తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం ఈ పరిశోధనలకు సహకారం అందజేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more