‘దొంగలు పడిన ఆర్నెళ్ళ తరువాత...కుక్కలు మొరిగినట్లు ’ గత వారం కోస్తాలో వచ్చిన ఫైలిన్ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఫైలిన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని వారిని ఇవాళ కలిసిన ఆయన వారి పై 40 కోట్ల వరాల జల్లు కురిపించారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పంటలను, అక్కడి మత్స్యకారులను పరామర్శించిన ఆయన ఇచ్చాపురం మండలంలో డొంకూరులో మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
మత్స్యకారుల గ్రామాలకు రూ. 40 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు కోటి రూపాయలు, కనీస సదుపాయాలకు రూ. 15 లక్షలు, డొంకూరు డ్వాక్రా మహిళా సంఘానికి రూ 10 లక్షల విలువ చేసే రెండు వాహనాలు మంజూరు చేస్తున్నట్లు కిరణ్ చెప్పాడు. ద్యార్థులకు వసతి గృహం కేటాయిస్తున్నట్లు, 30వేల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. తుపాన్ వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత వరకు ప్రభుత్వమే భరిస్తుందని సిఎం కిరణ్ చెప్పారు. తుపాన్ లో నష్టపోయిన రైతుల కొరకు ఎంత వీలుంటే అంత సహాయం చేస్తామని, బాధితులు తమ పేరును అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇక్కడ విలేఖర్లు రాష్ట్ర విభజన విషయాన్ని ప్రస్తావించగా ఇది సందర్భం కాదంటూనే తుఫాన్ ని ఆపలేక పోయినా... విభజనను మాత్రం ఆపుతానని అన్నారు. అయితే బాధితులను పరామర్శించడానికి వెల్లిన ఆయన విభజన గురించి మాట్లాడం పద్దతిగా లేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. మరి ఓట్ల కోసమే ఇన్ని వరాలు కురిపించాడా ? నిజంగానే వారిని ఆదుకోవడానికి చెప్పాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more