రాబోయే ప్రమాదాన్ని గమనించి ప్రాణ నష్టాన్ని ఎంతగానో తగ్గించుకోగలిగాం. అందుకు భారత వాతావరణ శాఖను ప్రశంసించటమే కాకుండా, తగురీతిలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కొనియాడ వలసిందే. కానీ పంటలు నష్టపోయాయి, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగింది. వాటిని పూరించుకోవటానికి ఎంత కాలం పడుతుందో అంచనా వెయ్యటానికి ఇంకా సమయం రాలేదు.
మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో భారీ నష్టం జరిగింది. ఇంకా వర్షం, చల్లటి గాలులు వణికిస్తున్నాయి. మీడియా కూడా సరైన సమయంలో సరైన రీతిలో స్పందించటం, ప్రజలను హెచ్చరించటంతో పాటుగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల చొరవ, అత్యవసర పరిస్థితిని గుర్తించి ఉద్యమాన్ని పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న ఉద్యోగులు కూడా శ్లాఘనీయులే.
మొత్తానికి గండమైతే గడిచింది కానీ జరిగిన పంటనష్టం, రోడ్లు నిర్మాణాలు, సమాచార వ్యవస్థలకు కలిగిన నష్టం శ్రీకాకుళం ఒక్క జిల్లాకే పరిమితమయ్యేది కాదు. దాని ప్రభావం రాష్ట్రమంతటిమీదా పడుతుంది.
భారత వాతావరణ సంచాలకుడు రాథోడ్ ఈ సందర్భంలో మాట్లాడుతూ, హెచ్చరికలను సకాలంలోనూ కచ్చితమైన లెక్కలతో చెప్పటం వలన జననష్టాన్ని నివారించామని అన్నారు. ప్రస్తుతం వీస్తున్న గాలులు చాలా బలహీనంగా ఉన్నాయని, ప్రమాదమైతే ప్రస్తుతం ఇంకేమీ లేదని అన్నారు. తుఫాన్ ప్రభావం కేవలం వర్షాలు కురిసేంతవరకే ఉంటుందని, ప్రస్తుతం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలే కాకుండా బెంగాల్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కూడా రాబోయే 24 గంటలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రాథోడ్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more