Jayaprakash narayan commnet on telangana division

jayaprakash narayan commnet on telangana, jayaprakash narayan commnet on telangana division, jayaprakash narayan , congress party,

jayaprakash narayan commnet on telangana division

రాష్ట్రం పై జేపీ కొత్త సూత్రం

Posted: 08/10/2013 11:45 AM IST
Jayaprakash narayan commnet on telangana division

రాష్ట్ర విభజన జరిగిన ఇన్ని రోజులు తరువాత లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మీడియా ముందుకు వచ్చారు. విభజన పై రాజకీయ నాయకులు నానా కామెంట్ లు , విమర్శలు చేస్తున్నారు. అయితే జేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. అయితే ఈరోజు ఆయన రాష్ట్రాలు ఎన్ని ఉన్నా సమైక్యత ముఖ్యమని జయప్రకాష్ నారాయణ అన్నారు. లోక్ సత్తా పార్టీ హైదరాబాద్ జూబ్లీహాల్ లో 26అంశాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని తెలుగు ప్రజలకు నమ్మకం కల్పించాలని అన్నారు. గతాన్ని తవ్వకుండా భవిష్యత్ గురించి ఆలోచిద్దామని ఆయన పేర్కొన్నారు. ఆవేశాలు, వాదనలు లేకుండా అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారికి విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య విభేదాలు లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని జయప్రకాష్ నారాయణ తెలిపారు. హైదరాబాద్ గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles