హైదరాబాద్ నగరంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పేదల పాలిట శాపంగా మారాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమో, దేవుడు వారికి విధించిన శిక్షో కానీ నగరంలో భవనాలు, గోడలు కూలి అమాయక ప్రజలు చనిపోతున్నారు. మొన్నటికి మొన్న నగరంలో సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ఘటన మరవక ముందే... నగరంలో ఉన్న మౌలాలీ ఈ రోజు తెల్లవారు జామున గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6గురు మరణించారు. నగరంలోని మౌలాలీ ఎంజీ కాలనీ గాయత్రినగర్లో పురాతన గోడ కూలి రెండు గుడిసెలు నెలమట్టమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెకంటయ్య (30) మహదేవ్ (36) లు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మౌలాలిలో ఆగోడ ప్రక్కన నివాసం ఏర్పరుచుకొని కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పురాతన గోడ కూలి రెండు గుడిసెల పై పడటంతో అందులో ఉన్న వెంకటయ్య, మహదేవ్, అతని భార్య పిల్లలు శివ(12), అనిల్(10) పై శిధిలాలు పడటంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో చిన్నారి లిల్లీని అక్కడి స్థానికులు బటయకు తీసి కాపాడారు. వెంకటయ్య భార్య, అతని పిల్లలు శిధిలాల కిందే ఉండటంతో వారికి కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించడంతో బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఇలాంటి వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more