కాలం చాలా వేగం దూసుకువస్తుంది. అప్పుడే సంవత్సరం తిరిగిపోయింది. గతం సంవత్సరం ‘మే’న అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు కు వెళ్లి మొన్నటికి సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో వైఎస్ జగన్ పెట్టిన పార్టీలో రాజకీయ మార్పులు ఎన్నో జరిగాయి. అయితే జగన్ జైలుకు వెళ్లి 365 రోజులు అయిన సందర్భంగా (నిరసనగా) పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కొన్ని కార్యక్రమాలు చెపట్టారు. అంటే వైఎస్ జగన్ కు మద్దతు గా ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది. అందులో భాగంగా దీక్షలు, నిరసనలు, కొవ్వుత్తుల ర్యాలీలతో, జగన్ మీద ఉన్న ప్రేమను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాటుకున్నారు.
ఈ కార్యక్రమలో ఆ పార్టీ నాయకులు, ప్రభుత్వం , ప్రతిపక్ష రాజకీయ పార్టీ మీద కొన్ని ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు జరిగే సమయంలో అధికారపార్టీ లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నియోజక వర్గం అయిన పీలేరులో రెండు రోజులు సందడి చెయ్యటం జరిగింది. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో రెండు రోజులు నగరంలో సందడి చేసింది. ఒకే రోజు రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు మీడియా వారికి చుక్కలు చూపించాయి. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తారోనని ఒంటి కన్నుతో మీడియా వారు ఎదురుచూపులు చూశారు. అయితే మూడు ప్రధాన పార్టీలు ఒకరి పై ఒకరు ఘాటైన విమర్శలతో మాటల యుద్దం చేసుకోవటం జరిగింది.
ఆ సమయంలో వైసీపీ పై టిడిపి నాయకుడు పేల్చిన కొన్ని విమర్శలతో, ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడ్డారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో వైసీపీ తలుపులు మూసివేస్తుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం మూతపడుతుందని ఆయన జోష్యం చెప్పారు. వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు నిజమే అనే విధంగా ఉన్నాయి. జగన్ ఎన్నిసార్లు బెయిల్ కు ఫిటిషన్ వేసిన, ఆయనకు బెయిల్ రాని విషయం అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జగన్ బెయిల్ ఫిటీషన్ పై చేసిన వ్యాఖ్యలకు, వర్ల రామయ్య మాటలకు దగ్గర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వర్ల రామయ్య వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల ముఖంలో నిరుత్సాహం తాండవం చేస్తుంది. అయితే వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి ఇదే చివరి మహానాడు అని కామెంట్ చెయ్యటం జరిగింది. కానీ ఈ మూడు నెలల్లో ఏం జరుగుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more