వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాద్యక్షరాలు వైఎస్ విజయమ్మ ఈ రోజు ఇందిరా పార్క్ దీక్ష చెయ్యటానికి సిద్దమైంది. అలాగే వైఎస్ షర్మిల కూడా పాలకొల్లులో నేడు నిరసన దీక్ష చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నిరసనగా ఈ ఇద్దరు దీక్షలకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలన్నింటిలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షలు కొనసాగుతాయి. కాగా వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు.
ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారు. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షలో పాల్గొంటారు. అలాగే జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది దాటిన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన సోదరి షర్మిల ఈరోజు పాలకొల్లులో నిరసన దీక్ష చేపట్టనున్నారు.
జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమె పాలకొల్లులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. షర్మిలతోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం దీక్ష విరమించడానికి ముందు ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడతారని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more