పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసిన సభ్యులపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సభాపతికి ఫిర్యాదుచేశాయి. ఫిర్యాదును స్వీకరించిన సభాపతి ఇరు పార్టీల సభ్యులకు గతంలోనే నోటీసులు జారీచేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన 18 మంది ఎమ్మెల్యేలకు సభాపతి నాదెండ్ల మనోహర్నోటీసులు జారీచేశారు. నోటీసులపై సభ్యులందరూ వివరణ ఇవ్వకపోవడంతో, సభాపతి మరోసారి నోటీసులు జారీచేస్తూ, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 13న 9మంది సభ్యులు, 14న 9మంది సభ్యులు హాజరుకావాలని సభాపతి సూచించారు.
అయితే గతంలో సభాపతి జారీచేసిన నోటీసులకు 14మంది వివరణ ఇవ్వగా, మిగతా సభ్యులు స్పందించలేదు. సభ్యుల ఇచ్చిన వివరణలను ఇరు పార్టీలకు సభాపతి పంపించే అవకాశం ఉంది. వివరణలపై పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించిన తరువాత సభాపతి అసమ్మతి సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే సభ్యుల వివరణ, తదితర అంశాలను పరిధిలోకి తీసుకుంటే, జూన్ రెండో వారంలో అసమ్మతి సభ్యులపై వేటువేసే అవకాశం ఉందని పార్టీలు వెల్లడిస్తున్నాయి. వేటు వేసే సమయానికి సాధారణఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం వ్యవధి ఉంటుంది. అయితే సాధారణ ఎన్నికలకు సంవత్సర వ్యవధి ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ గతంలోనే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పార్టీలు వెల్లడిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more