Pci chairman markandey katju in hyderabad

pci, markandey katju, press council of india, jaya lalita, thinaboomi, journists qualification

pci chairman markandey katju in hyderabad

pci-chairman.png

Posted: 04/05/2013 04:32 PM IST
Pci chairman markandey katju in hyderabad

pci-chairman-photo

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మార్కండేయ కట్జూ ఈరోజు హైద్రాబాద్ నగరానికి విచ్చేసారు. ఆయనకు గౌరవ విందును సియాసత్ సంపాదకుడు ఏర్పాటు చెయ్యగా పలువురు పత్రకారులు ఆయనను కలిసారు.

మార్కండేయ కట్జూ జర్నలిస్ట్ ల బాధ్యతలు విధుల గురించి మాట్లాడుతూ, వాళ్ళకి ఉండవలసిన కనీస అర్హతలను గురించి విచారించటానికి ఒక కమిటీని వేస్తున్నానని, దానికి పిసిఐ సభ్యుడు శ్రవణ్ గార్గ్ నేతృత్వం వహిస్తారని చెప్పారు.

దక్షిణభారతంలోని కొన్ని కేసులను పరిశీలించటానికి హైద్రాబాద్ వచ్చిన కట్జూ దినభూమి కేసులో తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత మీద విరుచుకుపడ్డారు. 2011 లో దినభూమి సంపాదకుడు మణిరామన్ ను మదురై లో ఆయన ఇంటి మీద దాడి చేసి అక్కడి నుండి ఆయనను తీసుకెళ్ళటం మీద మాట్లాడుతూ, న్యాయాన్ని గౌరవించాలి లేదా పదవిని వదిలి గద్దె దిగి పోవాలంటూ జయలలితను ఉద్దేశించి అన్నారు. ఇదింకా బ్రిటిష్ రాజ్ అనుకుంటున్నారేమో అన్నారాయన. ఆ ఘటనలో పాత్రవహించిన 30 పోలీసులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఆయన డిమాండ చేసారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles