ఈరోజు హైద్రాబాద్ బెంగళూరు హైవే మీద సడక్ బంద్ ని ఎలాగైనా సరే విజయవంతం చెయ్యాలని తెలంగాణా వాదులు వ్యూహరచనలు చేస్తుంటే, ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని పోలీసు బలగాలు కట్టుదిట్టాలు చేసుకున్నాయి.
ఒక్క దగ్గరే ఉంటే అడ్డుకోవటానికి పోలీసులకు సులభమవుతుంది కాబట్టి విడి విడిగా బృందాలుగా విడిపోయి వివిధ కార్యక్రమాలతో రహదారిని బంద్ చేద్దామనే ఆలోచనలో రకరకాల వ్యూహలను తెలంగాణా వాదులు పన్నుతున్నారు.
ఉదయం టిఫిన్లతో మొదలుపెట్టి మధ్యాహ్నం భోజనాలు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు. మరోపక్క మోటార్ సైకిల్ ర్యాలీ ఇలాంటి విభిన్న కార్యక్రమాలతో కార్యకర్తలను వ్యస్తులను చేస్తూ, మధ్య మధ్య ఉత్సాహపరుస్తూ, ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఓడించాలనే పద్ధతిలో యువతను ఉసిగొలుపుతూ ఉండటానికి నేతలు సిద్ధమవుతున్నారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం శాసనసభలో ప్రతిపాదన పెట్టాలన్న కోరికతో తెలంగాణా ఐకాస ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఆందోళనలో, తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, న్యూడెమాక్రసీ, సిపిఐ, సిపిఐ(ఎంఎల్), పార్టీలు పాల్గొంటున్నాయి.
అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు సరిగదా, ఇష్టారాజ్యంగా తెలంగాణా వాదులు చెయ్యటాన్ని సహించమనటానికి సంకేతంగా ఉద్యమకారుల మీద కఠినంగా ప్రవర్తించాలన్న సందేశాలు పోలీసు బృందాలకు చేరాయి. ఎనిమిది వేల మందితో రహదారి మీద విస్తృతంగా పహరా కాస్తున్న పోలీసు బృందాలు నిన్న సాయంత్రం నుంచే పరిస్థితిని అదుపులోకి తీసుకుంటూ ఆరామ్ ఘర్, శంషాబాద్, పాల్మాకుల, తిమ్మాపూర్ చౌరస్తా వరకూ ముఖ్యమైన ప్రాంతాలలో తాత్కాలిక చెక్ పోస్ట్ లు, పికెట్లను ఏర్పాటు చేసి రహదారి మీద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనా జరగకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా వాదులు అంటున్నట్టుగా ముందుగా ఎవరినీ అదుపులోకి తీసుకోవటం జరగలేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు.
విమానాశ్రయానికి గట్టి బందోబస్తు చేసారు. అయితే విమానాశ్రయం జోలికి పోవద్దని తెలంగాణా ఆందోళనకారులకు వారి నేతలు ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more