ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో సమావేశమై వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడ బొత్సా సత్యనారాయణ తాము ఖరారు చేసిన ఎమ్మెల్సీ జాబితాకు ఆమోద ముద్ర వేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర రెడ్డి, కరీం నగర్ నుంచి సంతోష్ కుమార్, నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, తూర్పు గోదావరి జిల్లా నుంచి లక్ష్మీ శివకుమారి, విజయనగరం నుంచి కొలగొట్ల వీరభద్రస్వామి పేర్లు ఖరారయ్యాయి. గవర్నర్ కోటాలో కంతేటి సత్యనారాయణ రాజుకి అవకాశం చిక్కింది.
అయితే కేంద్ర పర్యాటక శాఖకు అమాత్యులుగా పనిచేస్తున్న చిరంజీవి కోటగిరి విద్యాధరరావుకి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించటానికి సిఫారసు చేసారు. అది కుదరని పక్షంలో గౌతం కి ఇవ్వమని కోరినా ఫలితం లేకపోయింది. కుల సమీకరణల దృష్ట్యా ప్రత్యామ్నాయం సూచించినా చిరంజీవి సూచించిన ఇద్దరిలో ఏ అభ్యర్థికీ ఎమ్మెల్సీ అవకాశం లభించలేదు.
ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్సీ పోటీకి అభ్యర్థులను ఎంపిక చేసి రంగం సిద్ధం చేసారు. ఎమ్మెల్సీ పోటీ ఉన్న మూడు ప్రాంతాలకూ యనమల రామకృష్ణుడు, మహమ్మద్ సలీం, శమంతక మణిల పేర్లను ఎంపిక చేసారు.
తెదేపా సీనియర్ నేత దాడి వీరభద్రరావు కి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కనందుకు ఆయన మనస్తాపాన్ని వ్యక్తపరచారు. ఈ సంగతి ముందే తెలిస్తే నా అంతట నేనే ముందుగానే తప్పుకునేవాడిని కదా అన్నారాయన. యనమలకు అవకాశం ఇవ్వటంలో తనకి ఏ మాత్రం అభ్యంతరం లేదు కానీ తను పదవీకాలాన్ని కొనసాగించాలనుకోవటంలో కూడా తప్పు లేదు కదా అన్నారాయన. అయినా తాను తెదేపా కి పనిచేస్తాననే అన్నారాయన. కాకపోతే అధిష్టానం తీరుని నిరసించారు.
దాడి వీరభద్రరావు బాధను తను అర్థం చేసుకోగలనని ఆకివీడులో పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దాడికి ముందుగా సమాచారం ఇవ్వలేదన్నది నిజమే కానీ, పార్టీ దృష్ట్యా, సామాజిక న్యాయం దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవలసి వస్తుందని ఆయన అన్నారు.
అన్ని ప్రాంతల వర్గాలనూ దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తెలియజేసారు. అయితే, మైనారిటీలకు తెదేపా లోనే గుర్తింపు ఎక్కువగా ఉంటుందన్న విశ్వాసాన్ని తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సలీం అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more