భారత్ ఆర్థిక వ్యవస్థ జోరందుకుంది... ఫిబ్రవరి నెలలో చైనాను మించిపోయింది. భారత్ కాకుండా మిగిలిన అభివ్రుద్ది చెందుతున్ దేశాల్లో కూడా వ్రుద్ది రేటు కాస్తా మెరుగుపడిందని హెచ్ ఎస్ బీసీ సర్వేలో తేలింది. హెచ్ బీసీ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ (ఈఎంఐ) నెలవారి సర్వేలో జనవరిలో 53.8 పాయింట్ల నుంచి ఫిబ్రవరి నాటికి 52.3కి తగ్గిపోయింది. ఆగస్టు 2012 తర్వాత ఆ స్థాయిలోపడిపోవడం ఇదే మొదటిసారి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంది. ఫిబ్రవరిలో హెచ్ఎస్బీసీ భారత్ కాంపోజిట్ ఇండెక్స్... దీంతో తయారీ రంగంనుంచి సేవల రంగం వరకు ఉంటుంది. 54.8 పాయింట్లకు ఎగబాకగా... చైనా 51.4 పాయింట్ల వద్ద తచ్చాడుతోంది. సూచి 50 పాయింట్లు దాటితే వృద్ధిబాటలో కొనసాగుతున్నట్లు లెక్క అభివృద్ధి చెందుతున్న దేశాలను పరిగణనలోకి తీసుకుంటే చైనాతో పాటు భారత్ బ్రెజిల్లో వృద్ధి రేటు మందగించింది. అయితే చైనాతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో భారత్ వృద్ధిరేటు పెరిగింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధిరేటు పుంజుకున్నా అంత పెద్ద జోరు మాత్రం లేదు. ముఖ్యంగా తయారీ రంగంతో పాటు సేవల రంగం డీలాపడ్డాయి. కొత్త సంవత్సరంలో బ్రిక్ దేశాల్లో కాస్తా జోరందుకున్నా రాను రాను మందగించిందని హెచ్ఎస్బీసీ చీఫ్ ఎకనమిస్టు సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరోప్ సబ్ సహారన్ ఆఫ్రికా కు చెందిన మురాత్ ఉలేగన్ చెప్పారు. నాలుగు బ్రిక్ దేశాల ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు జనవరి నుంచి వేగం తగ్గిందని గత మూడు నెలల నుంచి ఉద్యోగాల భర్తీ కూడా చాలా తక్కువగా ఉందని హెచ్ఎస్బీసీ నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఫిబ్రవరి ఈఎంఐ నివేదికలో బ్రిక్ దేశాలకు ముఖ్యంగా తయారీ రంగం నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ... ఫిబ్రవరి నెల సూచి ప్రకారం చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు వృద్ధి రేటు అత్యంత కీలకమైనదని ద్రవ్యోల్బణానికి రెండవ ప్రాధాన్యం ఇస్తున్నారని ఉలేగన్ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మాంద్యం తాత్కలికమేనని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఉలేగన్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more