దేనికైనా రెడీ చిత్రంపై బ్రాహ్మణసంఘాల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఆధ్వర్యంలో కొందరు బ్రాహ్మణులు రాత్రి 8.30 గంటలకు సినీనటుడు మోహన్ బాబు ఇంటి ముందుకు వచ్చి చిత్రానికి వ్యతిరేకంగా నినాధాలు చేశారు. ఇంటి గేటు వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో మోహన్ బాబు అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నగరంలోని మాల్కాజ్ గిరికి చెందిన శివరామశర్మ దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మోహన్ బాబు , ఆయన కుమారుడు విష్ణు పలుమార్లు కలిసి అభ్యర్థించినా.. వారు తమను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. అయితే బ్రాహ్మణులు మేం ఆగ్రహిస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. తాజాగా ‘దేనికైనా రెడీ’ చిత్ర నిర్మాత మోహన్బాబు ఇంటి ముందు బ్రాహ్మణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మోహన్బాబు ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన బ్రాహ్మణులను ఆయన అనుచరులు తరిమికొట్టారు. పోలీసుల ఎదుటే కర్రలతో కొట్టారు. బ్రాహ్మణులపై తమ అనుచరులు చేసిన దాడిని హీరో విష్ణు సమర్థించుకున్నారు. తమ ఇంటిపై దాడికి వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. మగాళ్లెవరూ ఇంటిలో లేనిసమయంలో ఇంటిపైకి రావడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ వాళ్లపై చేయివేస్తే చూస్తూ ఊరుకోవడానికి పౌరుషం లేని వాడిని కాదన్నారు. తమ సినిమాపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో చాలా పద్ధతులున్నాయని, ఇళ్లపైకి రావడం సరికాదన్నారు. ‘దేనికైనా రెడీ’లో ఎవరినీ కించే పరిచే సీన్లు లేవని పునరుద్ఘాటించారు. అభ్యంతకర సన్నివేశాలుంటే తన తండ్రే సినిమా తీయరని స్పష్టం చేశారు. బ్రాహ్మలంటే తమకు ఎంతో గౌరవమని స్పష్టం చేశారు. సినిమా విడుదలైన ఐదు రోజుల తర్వాత ఆందోళనలకు దిగడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘దేనికైనా రెడీ’ అంటూ సవాల్ విసిరారు.
మరోవైపు బ్రాహ్మణులు తగ్గేదిలేదంటున్నారు. వారు దేనికైనా రె‘ఢీ’ అంట్నునారు. తమవారిపై విచక్షణారహితంగా దాడి చేసిన మోహన్బాబు అనుచరులను కేసు నమోదుచేయాలని బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ‘దేనికైనా రెడీ’కి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. మోహన్బాబుకు వ్యతిరేకంగా పూజలు చేయాలని బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. చలన చిత్రాలు వివాదాలకు కేంద్రబిందువులవడం ఈ మధ్యకాలంలో ఎక్కువయింది. అంగాంగ ప్రదర్శనలతో ‘వేడి’ పుట్టిస్తున్న ఈ కాలపు సినిమాలువివిధ వర్గాల మనోభావాలను కించపరిచే స్థాయికి దిగజారాయి. హాస్యం పేరుతో చూపిస్తున్న ‘నటన’ రోత పుట్టిస్తోంది. ఏదో ఒక వర్గాన్ని తక్కువ చేసి కామెడీ అనడం ఆనవాయితీ అయింది. సున్నితాంశాల పట్ల సినిమా రూపకర్తల బాధ్యతారహిత్యం పెరిగిపోయింది. దీంతో ప్రేక్షకులకు వినోదం పంచాల్సిన సినిమాలు వివాదాల్లో కూరుకుపోతున్నాయి. లక్ష్మణరేఖ దాటుతూ ఆగ్రహానికి గురవుతున్నాయి. వినోదం పంచాల్సిన సినిమాలు విచ్చలవిడి తనాన్ని వ్యాపింపచేస్తున్నాయి. తెలుగు భాష భ్రష్టుపట్టిపోవడానికి లేటెస్టు సినిమాలూ పుణ్యం కట్టుకున్నాయన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఆధునికత పేరుతో అశ్లీలతను తెరనిండా గుమ్మరిస్తూ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు సినిమావాళ్లు. మానవతా విలువలను గౌరవించకపోయినా ఫర్వాలేదు గానీ, చెడగొట్టకుండా ఉంటే మంచిదన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more