మహిళలను అసభ్యంగా చూపేందుకు ప్రయత్నించే వారెవరైనా ఇక మరింత కాలం జైలు శిక్షకు, భారీ జరిమానాకు సిద్ధంగా ఉండాల్సిందే. అశ్లీలమైన మల్టీమీడియా సందేశాలు లేదా ఈ మెయిళ్లు పంపినా జైల్లో కూర్చోవాల్సిందే. నేరం రుజువైతే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటివరకు కనీస జరిమానా రూ.2 వేలు మాత్రమే ఉంది. ఈ మేరకు మహిళల అసభ్య చిత్రీకరణ నిరోధక చట్టాన్ని (ఐఆర్డబ్ల్యూఏ-1986) సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మహిళలకు సంబంధించిన ఆడియో, వీడియోలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాను కూడా చట్ట పరిధిలో చేర్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో సవరించిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానంత రం ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇంటర్నెట్, మల్టీమీడియా సందేశాల వంటి కొత్త విధానాలను సైతం చట్ట పరిధిలోకి చేర్చడం ద్వారా.. మహిళలను అసభ్యంగా చూపించకుండా వారికి మరింత రక్షణ కల్పించడమే ధ్యేయంగా సవరణలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
సవరించిన చట్టం ప్రకారం, ఈ విధమైన నేరం రుజువైతే ఇప్పటివరకు ఉన్న జరిమానాను అలాగే గరిష్ట శిక్షాకాలాన్ని కూడా పెంచినట్లు ఆ ప్రకటన పేర్కొంది.రెండోసారి ఇదేవిధమైన నేరానికి పాల్పడితే కనీసంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇక జరిమానా కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు విధించే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీకృత అధికారులతో పాటు ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి పోలీసు అధికారులకు ఈ చట్టం కింద సోదాలు నిర్వహించే అధికారంతో పాటు స్వాధీన పరుచుకునే అధికారం ఉంటుంది. ప్రకటనలు, ప్రచురణలు, రాతలు, చిత్రలేఖనం ద్వారా లేదా మరో విధంగా మహిళలను అసభ్యంగా చూపించడాన్ని నిరోధించే ఉద్దేశంతో ఈ చట్టానికి రూపకల్పన చేశారు. ఈ చట్ట పరిధిలో ఇప్పటివరకు కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉంది.అయితే ఏళ్లు గడిచిన కొద్దీ సాంకేతిక విప్లవ ఫలితంగా ఇంటర్నెట్, ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థ, మల్టీమీడియా సందేశాలు, కేబుల్ టెలివిజన్ వంటి సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో ఈ చట్ట పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్లు ప్రభుత్వం వివరించింది. ఇదిలావుండగా రాజస్థాన్లో 758 జాతీయ రహదారి నిర్మాణానికిగాను రూ.899.24 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు, 65వ జాతీయ రహదారిలోని సల్సార్-హర్యానా సరిహద్దు సెక్షన్ను రెండు లేన్లుగా అభివృద్ధి పరిచే రూ.600 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more