ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాజకీయ జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో నిర్వహించిన తెలంగాణ మార్చ్ విజయవంతం అయింది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు ఈ మార్చ్లో పాల్గొనడం విశేషం. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ అర్థ్ర రాత్రి వరకు ఈ మార్చ్ సాగింది. ఈ మార్చ్ కి వర్షం అడ్డంకి కావడంతో రాత్రి 11.50 గంటలకు మార్చ్ ముగిసినట్లు ప్రకటించడంతో ముందు ప్రభుత్వం, ఆ తరువాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్చ్ అడపాదడపా హింసాత్మక సంఘటనలు తప్ప , పెద్దగా ఆటంకాలు ఏమీ జరగలేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు అడుగడుగునా తలపెట్టిన ఆటంకాలను అధిగమిస్తూ పది జిల్లాల నుంచి జనం లక్షలాదిగా తరలివచ్చారు. తెలంగాణ వాణి ఢిల్లీకి వినిపించే స్థాయిలో మార్చ్ నిర్వహించారు. లక్షలాదిగా కదిలి వచ్చిన జనంతో హుసేన్ సాగర్ జనసాగరంగా మారింది.
భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జనం పట్టుదలతోతడిసిముద్దవుతూనే నెక్లెస్ రోడ్డుపై నిలబడటం విశేషం. తెలంగాణపై ప్రకటన వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటామని జెఎసి నేత కోదండరామిరెడ్డి స్పష్టం చేయడంతో వర్షం వచ్చినా.. తడిసిపోతూ వేదికపై నుంచి వక్తల ప్రసంగాలు వింటూ కూర్చున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి సాగరహారానికి రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించాలని సర్కార్ను హెచ్చరిక జారీచేశారు. విచ్చలవిడిగా వాటర్కానన్లను, బాష్పవాయుగోళాలను ఉపయోగించిన పోలీసులు తెలంగాణవాదులను చెదరగొట్టి నెక్లెస్రోడ్ నుంచి తరిమేసే విధంగా ప్రవర్తించారు. బాష్పవాయుగోళాలతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. పోలీసుల విచ్చలవిడి బలప్రయోగంతో ఓ దశలో నేతలు కూడా వెనుకంజ వేసినా కవాతుకు హాజరైన జనంలో ఉత్సాహం, పట్టుదల చూసి నిర్ణయం మార్చుకున్నారు. తెలంగాణపై రోడ్మ్యాప్ ప్రకటన చేయించాలని తెలంగాణ మంత్రులను డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more