'ఇల్లు కట్టి చూడు' అన్న పెద్దల మాట వినే ఉంటారు. స్టీలు, సిమెంట్, ఇటుక, ఇతర సామగ్రితో పాటు డిజైన్, బిల్డర్, కూలీలు.. ఒకటేమిటి అదొక మహాయజ్ఞం. వీటికి తోడు ఆర్థిక సర్దుబాట్లు, తలనొప్పులు, నెలల తరబడి సమయం అన్నింటినీ భరిస్తేనే అందమైన ఇల్లు సాకారమవుతుంది. అయితే, ఓ అమెరికన్ నిపుణుడు తాను కనిపెట్టిన కొత్త టెక్నాలజీతో 'ఇల్లు కట్టడం ఇంత సులువా?' అనిపిస్తున్నారు. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఒకే ఒక్క రోజులో నివాస భవనాన్ని నిర్మిస్తున్నారాయన! 'కాంటూర్ క్రాఫ్టింగ్'గా ప్రస్తుతం విస్తృతంగా ప్రచారమవుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని సుసాధ్యం చేశారు. ఆయనే దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బెహ్రోక్ ఖోష్నెవిస్. కాంటూర్ క్రాఫ్టింగ్లో భాగంగా కంప్యూటర్తో అనుసంధానమైన భారీ క్రేన్ను వినియోగిస్తారు.
ఇళ్లు డిజైన్ ప్రకారం కంప్యూటర్ ఆదేశాలకు అనుగుణంగా ఇల్లు కట్టాల్సిన చోట క్రేన్కు ఉండే పరికరం మొదట ప్లాస్టిక్ అచ్చును త్రీడీ ప్రింటింగ్ చేస్తుంది. వెంటనే దానిపై మరో పరికరం కాంక్రీట్ను పొరను ఏర్పాటు చేస్తుంది. ఇలా అంచెలంచెలుగా(లేయర్లు) గోడల నిర్మాణం పూర్తవుతుంది. శ్లాబ్తో పాటు ఇతర ఫిట్టింగ్స్, మలుపులు, గదుల్లో ఎలక్రి ్టకల్, ప్లంబింగ్ పనులు, ఇతర డిజైన్లు కూడా ఒకేసారి పూర్తవుతాయి. ఈ విధానంలో నిర్మాణమయ్యే ఇళ్లు.. సాధారణ ఇంటి కంటే అందంగా, ద్రుఢంగా ఉంటాయట! పైగా 2500చదరపుటడుగుల ఇంటి నిర్మాణాన్ని 20గంటల్లోనే పూర్తవుతుందని బెహ్రోక్ చెబుతున్నారు. ఈ పద్ధతిలో బిల్డింగ్ మెటీరియల్ వ్యర్థాలు నామమాత్రంగా ఉండటంతోపాటు ఖర్చు కూడా చాలా తగ్గుతుందని చెప్పారు. అంతేనా, దీంతో అంగారకుడు, చంద్రునిపైనా సులభంగా ఇళ్లు, పరిశోధనశాలలు కట్టవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంటూర్ క్రాఫ్టింగ్ ప్రక్రియపై ఆయన కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more