Presidential election

presidential election

presidential election

15.gif

Posted: 07/22/2012 03:42 PM IST
Presidential election

       రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కీలక దశకు చేరుకుంది. ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం చెల్లిన ఎంపీల ఓట్లు 733 . ప్రణబ్‌కు 527 ఓట్లు రాగా, సంగ్మాకు 206 ఓట్లు వచ్చాయి. పూర్తి ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రణబ్ ఎన్నిక pra ఖాయమైంది. పార్లమెంటు హాలులోని రూమ్‌ నెంబరు 63లో గట్టి భద్రత మధ్య లెక్కింపు జరిగింది. ముందుగా పార్లమెంట్‌ హౌస్‌లో పోలయిన ఓట్లను లెక్కించారు. ఆ తరువాత రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సులను తెరిచారు.. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. ఒక్కో ఎంపీ ఓటుకు 708 ఓట్ల విలువ ఉంటుంది. ఎమ్మెల్యే ఓటుకు ఎంత విలువ ఉంటుంది అనేది సంబంధిత రాష్ట్రాల్లో జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రణబ్‌ ముఖర్జీకి 66.7 శాతం మంది ఓట్లు వేశారు. సంగ్మాకు 30.3 శాతం మంది ఓట్లు వేశారు. 3 శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తం 11 లక్షల ఓట్లు ఉండగా, ఇందులో 72 శాతం మాత్రమే పోలయ్యాయి. పోలయిన 8 లక్షల ఓట్లలో ప్రణబ్‌కు 5.6 లక్షల ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతితో ఈనెల 25వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణం చేయిస్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Captain laxmi kantha rao house arrest
Cyclone route change  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles