నాలుగు పదుల వయసు దాటిన ముదురు బ్రహ్మచారి.. సొట్టబుగ్గల చిన్నోడు.. రాహుల్గాంధీకి బంపర్ ఆఫర్! రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓం శాంతి శర్మ అనే మహిళ.. కాంగ్రెస్ యువరాజు గనక తన కుమార్తెను పెళ్లి చేసుకుంటే రూ.15 కోట్ల కట్నం ఇస్తానని ఆఫర్ చేస్తోంది. మాటవరసకు కాదు.. రాహుల్ని తన అల్లుడిగా చేసుకునే లక్ష్యంతో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఐదురోజులుగా జూలై 9 నుంచి మౌనదీక్షకు కూడా దిగిందామె. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి పెళ్లి చేయాలని ఇంట్లో చూస్తున్నారో లేదో తెలీదు గానీ.. రాహుల్ గాంధీకి శాంతి శర్మ తన ఇంటికి అమ్యూల్ బేబీగా వస్తే.. కట్నంగా 15 కోట్లు ఇస్తానంటూ బంఫర్ ఆపర్ ఇచ్చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన కూతురిని పెళ్లాడాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తోంది. మౌనవ్రతం కూడా పాటిస్తోంది. ‘నాకో కూతురు ఉంది. ఆమెను పెళ్లాడాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా. ఆయన పెళ్లికి ఒప్పుకుంటే రూ.15 కోట్ల కట్నం కూడా ఇస్తా’ అని రాసి ఉన్న ప్లకార్డుతో ఓం శాంతి శర్మ అనే మహిళ దీక్ష సాగిస్తోంది. తన స్వస్థలం రాజస్థాన్ రాజధాని జైపూర్ అని... తన అత్తమామలు, తల్లిదండ్రులు ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేస్తోంది. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఆ మహిళ ఈ నెల 9 నుంచి దీక్ష కొనసాగిస్తోంది. కాగా, ఆమెకు మతిస్థిమితం లేనట్టుందని, దీక్షకు అనుమతి కూడా తీసుకోలేదని పోలీసులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more