‘‘సేవే లక్ష్యం – ప్రేమే మార్గం’’ అంటూ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ పార్టీ పెట్టి, తరువాత కాంగ్రెస్ పార్టీలో కలిసి ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుత ప్రధాన మంత్రి కేబినెట్లో ఎట్టకేలకు బెర్తు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత మన్మోహన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో చిరంజీవికి పదవిని కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లో తల పండిన నాయకుడు, ఆర్థిక మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ తన పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన శాఖ ఖాళీగా ఉంది. అంతే కాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తన పదవిని పోగొట్టుకున్న హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి నిర్వహించిన ఉక్కుశాఖ మంత్రి సీటు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రధాని తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మరిన్ని శాఖలు కూడా ఆయన వద్దే ఉంచుకున్నారు. ఈనెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఈ ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలను ఆయన భర్తీ చేయనున్నారు. ఇందులోభాగంగా.. చిరంజీవికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. అయితే, ఆయన వీరభద్రా సింగ్ నిర్వహించిన ఉక్కు శాఖా లేదా కేంద్ర పర్యాటక శాఖల్లో ఒకదాన్ని చిరంజీవికి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. అలాగే, ఆర్థిక శాఖను మాత్రం చిదంబరానికి కేటాయించవచ్చని తెలుస్తోంది. అయితే, ఆయనకు కేటాయించాల్సిన శాఖపైనే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. మన్మోహన్ సింగ్ తర్జనభర్జనలు పడుతున్నట్టు సమాచారం. మరి చిరంజీవికి ఏ పదవి దక్కుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more