మారణకాండలో భారత్పై పాకిస్తాన్ మరోమారు ఎదురుదాడికి దిగింది. 2008 నవంబర్ 28న ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడుల్లో 40మంది భారతీయుల ప్రమేయం ఉందని పాక్ అధికారులు వ్యాఖ్యానించారు. కేసుకు సంబంధించి ఇటీవల న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో పట్టుబడిన లష్కరే తోయిబా కార్యకర్త జబీయుద్దీన్ అన్సారీ ముంబయి దాడులను తాము కరాచీలోని ‘కంట్రోల్ రూమ్’ నుంచి ఎలా పర్యవేక్షించిందీ వివరించిన నేపథ్యంలో, పాకిస్తాన్ అధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో దాడులకుపాల్పడిన తీవ్రవాదులకు దాదాపు 40మంది భారతీయులు సహాయ సహకారాలు అందించినట్టు తమవద్ద సమాచారం ఉందని, దీనిపై భారత్ నుంచి వివరణ కోరుతున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయానికి చెందిన ఒక అధికారి పేర్కొన్నట్టు ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్ ఇంటరాగేషన్లో వెల్లడించిన అంశాలను తమకు తెలియజేయాల్సిందిగా ఉభయ దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల్లో భారత్పై ఒత్తిడి తీసుకువస్తామని ఆ అధికారి పేర్కొన్నారు.
రెండురోజుల పాటు జరిగే భారత్- పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభం కానున్నాయి. జబీయుద్దీన్ అన్సారీ అరెస్టు వ్యవహారం, తర్వాత భారత్ లేవనెత్తిన అంశాలు చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నామని, అన్సారీ అరెస్టుకు సంబంధించిన వివరాలు తమకు తెలియజేయాల్సిందిగా పాక్ ఈ చర్చల సందర్భంగా భారత్ను కోరుతుందని ఆ అధికారి తెలిపారు. అన్సారీ అరెస్టుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని భారత్ ఇప్పటివరకూ తమకు తెలియజేయలేదని ఆ అధికారి పేర్కొన్నారు. ముంబయి దాడులు భారతీయుల సహాయం లేకుండా జరగడం అసాధ్యమన్న విషయాన్ని పాకిస్తాన్ పదేపదే చెబుతోందని ఆ అధికారి అన్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందించేందుకు భారత అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more