బొత్స అంటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాదు? శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై పాశవికంగా దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు బొత్స వాసుదేవ నాయుడును సిఐడి అధికారుల బృందం హైదరాబాద్లో అరెస్టు చేసింది. హైదరాబాద్లో బంధువుల ఇంట్లో నాయుడు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న సిఐడి అధికారులు అతన్ని అరెస్టు చేసినట్లు డిజిపి కార్యాలయ అధికార ప్రతినిధి, శాంతిభద్రతల విభాగం డిజి ఎస్ఏ హుడా తెలిపారు. కాగా, ఈ కేసులో నాయుడు కీలక నిందితుడు కావడంతో సిఐడి విచారణ కీలక మలుపు తిరిగింది.
లక్ష్మీపేట ఘటనలో వాసుదేవ నాయుడు తెర వెనుక ఉండి దళితులపై దాడి చేయించారని అక్కడ ఉన్న దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. రాష్ట్ర వ్యాప్తంగానే ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళితులపై దాడి జరిగినప్పుడు కొందరు చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు. ఈ దారుణ సంఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో దాడిని నివారించలేకపోయిన స్థానిక డిఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐలను విధుల నుంచి తొలగించి విఆర్కి పంపించింది. అనంతరం ఈ కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ రెడ్డి ప్రకటించారు. కేసు దర్యాప్తును చేపట్టిన సిఐడి బృందాలు విచారణకు రంగంలో దిగాయి. విచారణకు సిఐడి అదనపు ఎస్పి రమణారావును పోలీసు శాఖ నియమించింది. సిఐడి విచారణ అనంతరం 65 మందిని ప్రాథమికంగా నిందితులుగా గుర్తించి కొందరిని అదుపులోకి తీసుకుంది. సిఐడి ఇన్చార్జ్ అదనపు డిజిపి గోపాల్రెడ్డి శ్రీకాకుళం జిల్లాల్లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు బొత్స వాసుదేవ నాయుడు అరెస్టు కావడంతో విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more