సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ వేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. కడపజిల్లాలో తన పర్యటన ముగించుకుని వచ్చిన సిఎం కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణతోనూ, ముఖ్యకార్యకర్తలతోనూ మాట్లాడారు. తిరుమల ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాని సందర్శించాలంటే ముందు తిరుపతికి చేరుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల విషయంలో రోమ్ తో పోటీ పడే తిరుపతి అసెంబ్లీకి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ తామే గెలుపొందాలని ప్రధానపార్తీలు పట్టుదలగా ఉన్నాయి. గెలుపు ఆరాటం ఎక్కువయి ఏదైనా చేయండి ఇక్కడ మనం తప్పక విజయం సాధించాలంతే అనే స్థాయికి ఆ పార్టీల నేతలు వచ్చి కార్యకర్తలను ప్రాధేయపడుతున్నారు. అలానే మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకరరెడ్డి గురించి తాను చూసుకుంటానని సిఎం హామీ ఇచ్చారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 262 పోలింగ్ బూత్ లున్నాయి. తెలుగుదేశం పార్టీ బూత్ ల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి ఎన్నికలకు సిద్ధమవుతోంది. అలానే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహాదేవ నాయుడు నియోజకవర్గంలో ప్రచారపరిస్థితి, పార్టీ విజయావకాశాలు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తిరుపతి చేరుకున్నారు. తాను ఎన్నికల తరువాతే తిరిగి వేదతానని ఆయన అంటున్నారు. ఈ పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి ఉదయమే లేచి వాకింగ్ కు వెళుతూ తోటి వాకర్లను ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.
అలానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కూడా సంఘాలు, అసోషియేషన్లను టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి కందాటి మురళి కూడా ప్రచారంలో ఉన్నారు. తనను గెలిపిస్తే కార్మిక, ఉద్యోగం మహిళా సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఈయన తన ప్రచారంలో భాగంగా హామీ ఇస్తున్నారు. ఇలా ప్రతీ పార్టీ తమ గెలుపుకోసం ఒకవైపు కార్యకర్తలను సమీకరించుకోవటం, మండుటెండలోనూ ఆపకుండా ఇంటింటికి తిరగటం, ప్రత్యేకించి సమస్యల పరిష్కారాల హామీలు చూస్తుంటే తిరుపతి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు పార్టీలకు ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పకుండానే అర్థం అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more