అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 28న న్యాయస్థానానికి హాజరు కావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.. జగన్ ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరో రోజు వచ్చేందుకు అనుమతించాలని కోర్టుకు విన్నవించుకునే అవకాశముంది. అయితే... 28న కోర్టుకు రాకుంటే... కేసులకు భయపడుతున్నారనే సంకేతాలు వెళతాయని, అందుకే అదే రోజు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు లేనిపోని పంతాలు భవిష్యత్తుని అంధకారమయం చేస్తాయనేది వారి భయంగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. 'మే 28'వ తేదీ జగన్ కు అచ్చిరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు మదనపడుతున్నారు. దీనికి కారణంలేకపోలేదు.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్ ఓదార్పు యాత్ర కోసం వరంగల్ జిల్లా మహబూబాబాద్ (మానుకోట) బయలుదేరారు. తెలంగాణవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. మానుకోట రైల్వే స్టేషన్లో రాళ్ల వర్షం, కాల్పులు, గందరగోళం నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి పోలీసులు జగన్ను హైదరాబాద్కు తరలించారు. అదే సంఘటనకు నిరసనగా 'రెండేళ్ల మానుకోట ఘటన' పేరుతో 28వ తేదీన తెలంగాణ జేఏసీ ప్రదర్శనలు, పాదయాత్రలు నిర్వహిందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాక, ఇదే రోజు జగన్ కోర్టుకు హాజరవటం ఏ కీడు చేస్తుందో అని జగన్ పార్టీనేతలు వాపోతున్నారు. వీటన్నిటికీ తలవంచి జగన్ కోర్టుకు హాజరవుతారో లేక మొఖం చాటేస్తారో చూడాలి. మొత్తంగా రాజకీయవర్గాలేకాదు.. రాష్ట్రప్రజలు ఈనెల 28 వ తేదీకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more