భారత్ కి స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటినా ఇంకా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని మనం నిర్మించుకోలేకపోతున్నాం. అలాగే ‘ "అర్ధరాత్రి మహిళలు ఒంటరి గా తిరిగినప్పుడే నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు'' ..అని గాంధీజీ అన్నారు. కానీ ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే మనకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదనే చెప్పాలి. ఈ అం శంపై దేశవ్యాప్తంగా అసోచామ్ నిర్వహించిన సర్వే లో 73 శాతం మంది మహిళలు రాత్రి వేళల్లో పనిచేసేటప్పుడు తాము తీవ్ర అభద్రతకు గురవుతున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అని లేదు. దేశంలో ప్రధాన నగరాలన్నిటా ఇదే పరిస్థితి.
ఈ సర్వే ప్రకారం.. దేశంలో మహిళలకు భద్రతలేని అత్యంత అరక్షిత మెట్రోనగరం ఢిల్లీనేనని తేలింది. తర్వాతి నాలుగుస్థానాల్లో వరుసగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై నిలిచా యి. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో వివిధ సంస్థ ల్లో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగులను ప్రశ్నించారు. ఆ నివేదిక ప్రకారం.. బీపీవోలు (బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్), ఐటీ రంగం, ఆతిథ్య రంగం, మీడియా.. ఇతర రంగాల్లో కన్నా వీటిలో పనిచేసే మహిళలపై మానసిక, శారీరక దాడులు అత్యధికం. అదీ.. రాత్రిపూట పనివేళల తర్వాత! రాత్రివేళ్లల్లో విధులు నిర్వర్తించే మహిళలకు సరైన రవాణా సౌకర్యం కల్పించకపోవడం, వారి భద్రతకు అవసరమైన చర్యలు సరిగా చేపట్టకపోవడం, అధికారుల మొండితనం వల్ల మహిళలపై అత్యధిక క్రైమ్ రేటుకు కారణం. చిన్న తరహా సంస్థల్లో పనిచేసే మహిళలు ఎక్కువగా (21 శాతం) మానసిక వేధింపులకు గురవుతున్నారు. మధ్యతరహా సంస్థల్లో ఇది 14 శాతం కాగా.. పెద్ద సంస్థల్లో 8 శాతం మంది మహిళలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మరి దేశ రాజధాని ఢిల్లీలోనే మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలు దేశంలోని మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాయి ?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more