తెలుగు దేశం పార్టీకి పంచ్ మీద పంచ్ పడుతుంది. ఆ పార్టీలో ఉన్న ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా వైయస్సార్ కాంగ్రెస్ లోకి, ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. మొన్నటికి మొన్న పేర్వారం రాములు, గద్దె బాబురావులు వైయస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే క్రిష్ణ జిల్లా నుండి వల్లభనేని వంశీ ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైయస్సార్ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత మైసూరా రెడ్డి కూడా త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మైసూరా రెడ్డి సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మరో దఫా రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన బాబుపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయన జగన్ వైపు వెళతారా అనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గత మూడు రోజులుగా చంద్రబాబు కడప జిల్లా ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో పర్యటించారు. ఆ జిల్లాకే చెందిన నేత అయినప్పటికీ మైసూరా ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు. ఆయన మేనత్త మరణించారని, అందుకే ఆయన పాల్గొనలేదని కొందరు చెబుతున్నారు. కానీ చంద్రబాబును మాత్రం కలవలేదని అంటున్నారు.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెసులో చేరతారా అన్న ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. రెండోసారి చంద్రబాబు తనకు రాజ్యసభ ఇవ్వకపోవడంతో మైసూరా రెడ్డి ఇక రాజకీయాలకు స్వస్తీ చెప్పి తన బిజినెస్ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ తాజాగా జగన్ వైపు వెళతారనే ప్రచారం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more