మన రాష్ట్రంలో గతంలో ఎన్నో వ్యభిచార ముఠాల గుట్టు రట్టయినా, తాజాగా వ్యభిచారం కేసులో అరెస్టయిన తారా చౌదరి వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం కలిగిస్తుంది. ఆ సంఘటన విచారణలో ఉండగానే గుంటూరులో మరో (తారా చౌదరి) శ్రీదేవి ముఠా అనే వ్యభిచార గుట్టు రట్టయింది. తారా చౌదరి అమ్మాయిలను వ్యభిచారంలోకి దించి, వారి రాసలీలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో గుంటూరులో శ్రీదేవి ముఠా కూడా అచ్చం తారా లాగే బ్లాక్ మెయిల్ చేస్తూ పట్టుబడింది. ఈమె నెట్ వర్క్ మన రాష్ట్రంలోనే కాకుండా డిల్లీ నుండి గల్లి వరకు మన హైదరాబాద్ లో కూడా విస్తరించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
గుంటూరు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యుడు కాయితి వెంకట నర్సిరెడ్డికి గతనెల 20 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపుఫోన్లు వచ్చాయి. 10 లక్షలు ఇవ్వకుంటే మీకు సంబంధించి అశ్లీల దృశ్యాలను మీడియాకు విడుదల చేస్తామని, నెట్ లో ఉంచుతామని బెదిరించారు. దీంతో ఆయన గత నెల 26న గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా వ్యవహారం వెలుగు చూసింది.గతంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ పత్రిక ప్రకటనల విభాగంలో పని చేసిన మెటపోతుల కేశవరావు, తనకు పరిచయం ఉన్న విజయవాడకు చెందిన న్యాయవాది చింతల రాంప్రసాద్, చెన్నైకి చెందిన శ్రీదేవితో ముఠా ఏర్పాటు చేశాడు. ప్రముఖులను గుర్తించి వారి సెల్కు శ్రీదేవితో ఫోన్లో మాట్లాడించి ట్రాప్ చేస్తారు. తరువాత వారిని పిలిపించుకుని శృంగార కార్యకలాపాల్లో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించి, బ్లాక్మెయిల్ చేస్తారు.
ఈ క్రమంలో హైదరాబాద్లోని నిమ్స్ కు చెందిన వైద్యుడ్ని బెదిరించి 13 లక్షల వరకు వసూలు చేశారు. తరువాత ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వశాఖలో పనిచేసే పీఏ ఓజా, పార్లమెంట్లో పనిచేసే మణిపాల్ యాద వ్, తబలా అనే వారితోపాటు గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట నర్సిరెడ్డి తదితరులను ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ముఠా సభ్యులు కేశవరావు, చింతల రాంప్రసాద్ను కొద్దిరోజుల కింద అరెస్ట్ చేశారు. శ్రీదేవిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more