Congress rajya sabha leader chiranjeevi

Congress Rajya Sabha leader Chiranjeevi, Electricity Bill, congress Party,

Congress Rajya Sabha leader Chiranjeevi

Chiranjeevi.gif

Posted: 04/10/2012 10:16 AM IST
Congress rajya sabha leader chiranjeevi

Congress Rajya Sabha leader Chiranjeevi

ఇప్పటికే పెంచిన విద్యుత్‌ ఛార్జీల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాలని కాంగ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒక లేఖ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కోరారు. విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు కారణంగా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చిరంజీవి ఆ లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత కొద్ది సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ ఏడాది విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ విద్యుత్‌ కోతల వల్ల విద్యార్థులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇక్కట్ల పాలవుతున్నాయని, ఉత్పత్తి క్షీణిస్తున్నదని ఈ కాంగ్రెస్‌ నేత ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల సంగతి అలా ఉంటే, విద్యుత్‌ కోతల వల్ల గ్రామాల్లో నీటి సరఫరాకు విఘాతం కలుగుతున్నదని, మరోపక్క విద్యుత్‌ ఛార్జీ పెంపు భారాన్ని గ్రామీణులు భరించలేకున్నారని చిరంజీవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితుల మధ్య వీరికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే, ఇఆర్‌సి సిఫారసులతో ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలకు ఛార్జీలను తగ్గించగా, ప్రభుత్వ తాగునీటి పథకాలకు, లిఫ్ట్‌ స్కీమ్‌లు, వీధి దీపాలు, కుటీర పరిశ్రమలు, దోభీ ఘాట్‌లకు, పౌల్ట్రీ పరిశ్రమలకు, చెరకు క్రషింగ్‌ తదితరాలకు ఛార్జీలు పెంచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఛార్జీల పెంపు వెనుక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress leaders openly attack ysr
Osd m sarveshwar reddy arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles