Chief minister n kiran kumar reddy said

chief minister, n kiran kumar ,reddy said

chief minister n kiran kumar reddy said

18.gif

Posted: 03/24/2012 05:48 PM IST
Chief minister n kiran kumar reddy said

          cm_kiran_kumar_reddy రైతులకు వడ్డీలేని రుణాలిస్తేనే మేలు జరుగుతుందని రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌ అన్నారు. ఇవాళ జూబ్లీహాల్‌లో రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్సీలకు, బీసీలకు వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వారికి సూచించారు. రైతులకు బ్యాంకు రుణాల పంపిణీలో లోపాలు ఉన్నాయని సీఎం అన్నారు.
ప్రతి కౌలు రైతుకు రుణం మంజూరు చేయాలని, ప్రతి కుటుంబానికి బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలని సీఎం సూచించారు. లక్ష్యాల మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని మంత్రి ఆనం పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు రుణాలు పెంచాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు.aanam
           కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయం త్వరితగతిన పొందేందుకు రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం ఈనెల 27న ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితులపై నివేదించనుంది. రాష్ట్రానికి తక్షణ సహాయంగా 3,774 కోట్లు అందించాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపించిన సంగతి తెలిసిందే. raghuveera                    

         రైతాంగాన్ని ఆదుకునేందుకు, సత్వరమే రుణాల రీషెడ్యూల్ చేయించేందుకు కరువు నిధుల విడుదలే కీలకం. ఈనేపథ్యంలో అటు ఇన్‌పుట్ సబ్సిడీ 1,880 కోట్ల రూపాయలు, రైతాంగాన్ని ఆదుకునేందుకు మరో 3వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని బృందం సభ్యులు ప్రధానమంత్రిని కోరనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in jeedimetla hyderabad
Machilipatnam express railway passengers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles