Lagadapati rajagopal commrnts on by elections

Lagadapati Rajagopal commrnts on by elections,Lagadapati Rajagopal Analysis on Bi-election polls, Lagadapati, Rajagopal, Analysis, on, Bi-election, polls, Tollywood News,Telugu Cinema News,Tollywood Photos,Actress Photos,

Lagadapati Rajagopal commrnts on by elections

Lagadapati.gif

Posted: 03/19/2012 12:00 PM IST
Lagadapati rajagopal commrnts on by elections

Lagadapati Rajagopal commrnts on by elections

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యుర్ధులే విజయం సాధించనున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. డిసెంబర్, మార్చిలో తాను చేయించిన సర్వేలో ఇదే తేలిందని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సర్వే ఫలితాలు వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్ధానాల్లోనూ రాజీనామా చేసిన అభ్యర్థుల్నే విజయం వరించనుందని చెప్పారు. టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గతంతో పోలిస్తే మోజారిటీ తగ్గనుండగా కాంగ్రెస్, టీడీపీకి ఓట్లు గణనీయంగా పెరగనున్నాయని పేర్కొన్నారు. గతంలో 65 శాతం ఓట్ల మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్..

ఈసారి కేవలం 25 శాతం మెజారిటీకే పరిమితంకానున్నట్లు సర్వేలో తేలిందని, దీన్నిబట్టి వారి ప్రభావం తగ్గుతుందన్న సంకేతాలు వెలువడ్డాయని సూత్రీకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తులో మెరుగైన ఫలితాలోస్తాయని జోస్యం చెప్పారు. ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించాల్సి ఉన్నా చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు వల్ల కోల్పోనుందని లగడపాటి తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ చెరి రెండు చోట్ల రెండో స్థానంలో ఉంటాయని, మిగిలిన మూడు చోట్ల రెండో స్థానానికి పోటీ నువ్వానేనా అన్నట్లు ఉందని చెప్పారు. ప్రభుత్వ పనితీరు బాగుందని మెజారిటీ ప్రజలు అభివూపాయపడ్డా ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయలేదని అన్నారు. ఓటింగ్ శాతం పెరిగిందన్న సంతోషం ఉన్నా ప్రభుత్వ అనుకూల ఓట్లను పొందలేకపోయామన్న బాధ కూడా ఉందని చెప్పారు. అసత్య ప్రచారాన్ని, ఆరోపణల్ని తిప్పికొట్టడంలో నేతలు, కార్యకర్తలు విఫలమయ్యారని పేర్కొన్నారు.

వివిధ అంశాల పట్ల అధిష్ఠానం నుంచి క్షేత్రస్థాయి వరకు స్పష్టతలేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొందని, అది అంతిమంగా కాంగ్రెస్ ఓటమికి దారితీయనుందని తెలిపారు. ఎవ్వరిపైనా సానుభూతి/మెతక వైఖరి ప్రదర్శించొద్దని అధిష్ఠానానికి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు తమకు గుణపాఠం నేర్పనున్నాయని, భవిష్యత్తులో తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం చెప్పాల్సింది ఇప్పటికే చెప్పేసిందని, అధికారిక ప్రకటన తప్ప అన్నీ అయిపోయాయని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bs yeddyurappa issues fresh deadline to make him karnataka cm
Dinesh trivedi resigns as railway minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles