ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులకు మధ్య తిట్ల పురాణాల పర్వం కొనసాగుతున్నది. లాలాపేట్ ఏపీ డెయిరీ ఆవరణలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్మికుల సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ, సికింద్రబాద్ ఎంపీ అంజన్కుమార్యాదవ్లు కలిసి పోటాపోటీగా వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఘాటైన మాటలతో విరుచుకుపడ్డారు. తొలుత అంజన్కుమార్ యాదవ్ మంత్రి ముఖేష్గౌడ్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ మైనే మంగా ప్యాల్లి .. లేకిన్ భగ్వాన్ నే దియా తాలి చున్నెకో కోషిష్ కియాతో రాక్ బన్ జాయేగా ’’ (నేను భగవంతున్ని చిన్న పాత్ర అడిగాను అయితే నాకు దేవుడు పెద్ద పాత్రనే ఇచ్చాడు. ఈ పాత్రను లాక్కోవాలని ప్రయత్నం చేస్తే మాడి మసై పోతారు) అంటూ మండి పడ్డారు. సర్వే, నేను ఎవరిని మోసం చేసి పైకి రాలేదని మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోమన్నారు. అనంతరం సర్వే సత్యనారాయ ఉప్పల్ ఎమ్మెల్యే రాజిడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా ఎంపీ అభ్యర్థిని తయారు చేస్తాడట... ఇప్పుడే దమ్ముంటే నిలబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను, అంజన్లిద్దరం పేదరికం నుంచి ఎంపీలుగా ఎదిగి బడుగుల కోసం పోరాడుతున్నామనే తప్పా అక్రమ ఆస్తులు కూడా బెట్టలేదన్నారు. అంజన్ హటావో అంటే ..ఎవరు ఊరుకుంటారని ముచ్చటగా మూడోసారి అంజన్ను గెలిపించుకుంటామన్నారు. రానున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అంజన్కు మంత్రి పదవి కూడా వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మేము ఇద్దరం ట్విన్స్ ..ఎవరైనా మాకు అడ్డువస్తే ఊరుకోమన్నారు. రాజి రెడ్డి మాదిరిగా భూకబ్జాలకు తాము పాల్పడలేదన్నారు. దివంగత వైఎస్ నాకు టిక్కెట్ రాకుండా అడ్డుకుంటే రాజకీయ పునర్జన్మనిచ్చింది సోనియా గాంధేనని అన్నారు. అందుకే ఆమె కాళ్ళ వద్ద ఉంటూ పార్టీకి సేవ చేస్తానన్నారు. రాజి రెడ్డికి చదువురాదు... అంగుటాచాపు గాడికి టికెట్ పిలిచి ఇచ్చారన్నారు. లారీ క్లీనర్గా పనిచేసిన వాడు తాను ఎంపీగా ఉన్న స్థానానికి అభ్యర్థిని డిసైడ్ చేస్తావా బడివే.. లంబ్డికొడుకా .. అంటూ పదే పదే ఈ పదాలను వాడుతూ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more