‘‘అన్నీ ఉండి.... అల్లుడు నోట్లో శని’’ ఈ సామెత మన భారత క్రికెట్ టీంకి సరిగ్గా సరిపోయింది. ఆస్ట్రేలియా టూర్ లో దారుణంగా విఫలం అయి టెస్టుల్లో క్లీన్ స్విస్ చేయించుకొని, వరల్డ్ ఛాంపియన్ ఫేవరెట్ గా ముక్కోణపు సిరీస్ లో అడుగుపెట్టిన భారత్ అడపాదడపా ఆడుతూ... పీకలదాకా తెచ్చుకొని.. చివరి లీగ్ మ్యాచ్ లో అద్బుత విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకొని... లక్ కోసం ఎదురు చూసింది. కానీ అది కలిసి రాలేదు. దాంతో ముక్కోణపు సిరీస్నుంచి భారత్ ఇంటి దారి పట్టింది. ఇవాళ ఆసిస్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించడంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. గత మ్యాచ్లో లంకపై సాధించిన బోనస్ విక్టరీ వృథా అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 238 పరుగులు సాధించింది. అయితే ఆస్ట్రేలియా లంక టార్గెట్కు 9 పరుగుల దూరంలో ఆలౌటయింది. దీంతో శ్రీలంక ముక్కోణపు సిరీస్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. వన్డే సిరీస్ నుంచి భారత్ వైదొలగింది. మరి ఆసియాకప్ లోనైనా సరిగ్గా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏదో ఆడక ఆడక ఆడి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకున్న భారత్ కి నేడు ‘ఆస్ట్రేలియా’ శని లాగా తయారయిందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి శ్రీలంక 238 పరుగులు చేసింది. 49.1 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 229 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లు.. డేవిడ్ హస్సీ 74, వాట్సన్ 65, హుస్సే 29, పాటిన్సన్ 12 పరుగులు చేశారు. మలింగ 4, కులశేఖర 2, సేననాయకే, తిరిమన్నే, హీరత్ తలో ఒక వికెట్ తీసుకున్నారు. శ్రీలంక ఆటగాళ్లు.. చందీమాల్ 75, సంగక్కర 64, తిరిమన్నే 51, హీరత్ 14 పరుగులు చేశారు. పాటిన్సన్ 4, క్రిస్టియన్ 5 వికెట్లు తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more