మంగళవారం సమ్మె జరుగుతున్న సమయంలో పశ్చిమబెంగాల్ జాదవ్ పూర్ లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు సిపిఎమ్ కార్యాలయంమీద దాడి చేస్తున్న ఘటన ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల మీద దాడి జరిగిన కేసులో పోలీస్ కాన్ స్టేబుల్ ని సస్పెండ్ చేసారు. ఈ ఘటనను పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎమ్ కే నారాయణన్ ఖండించగా, అంతా నాటకం భూటకం జర్నలిస్ట్ లు అబద్ధాలాడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టిపారేస్తున్నారు.
గవర్నర్ నారాయణన్ ఈ సంఘటన మీద మాట్లాడుతూ జర్నలిస్ట్ లను ఎందుకు కొట్టటం. అది కూడా బంద్ రోజుల్లోనే ఎందుకు జరుగుతుంది. అసలెవరినైనా కొట్టటం ఎందుకు అని అంటూ, జర్నలిస్ట్ ల దెబ్బల మనమీద కూడా పడుతుంటాయనుకోండి అని నవ్వుతూ అన్నారు. స్వేచ్ఛాస్వాతంత్రాలనున్న మనదేశంలో వాళ్ళకి కావలసిన సంఘటనలను వాళ్ళు చూసే హక్కు ఎవరికైనా ఉంది- అది కూడా దెబ్బలు తినకుండా అని గవర్నర్ అన్నారు. అలాగే మొన్న మమతా బెనర్జీ మేనల్లుడు పోలీస్ ఆఫీసర్ మీద చెయిచేసుకోవటాన్ని కూడా తప్పు పడుతూ హింసకు దిగటం తప్పు అందునా యూనిఫాంలో విధుల్లో ఉన్న పోలీసుల మీద అని గవర్నర్ అన్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం జర్నలిస్ట్ లు అసత్యాలాడుతున్నారు, ఒట్టిగానే అంతా నాటకం ఆడినట్టుగా చేసారు అని ఆరోపించారు. బంద్ లు సమ్మెల వలన ఏ ప్రయోజనం లేదని చెప్తూ బంద్ కి ముందు రోజు మమతా ప్రకటననిచ్చారు. ఎవరినీ బలవంతంగా సమ్మెలో భాగం వహించేట్టుగా చెయ్యవద్దు, ఎవరి పనులకూ ఆటంకాలు కలిగించవద్దు, రాష్ట్రంలో శాంతిభద్రతలుండాలంటూ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బంద్ తర్వాత రోజు కూడా రాష్ట్రంలో బందేమీ లేదన్న సంకేతాన్నిచ్చారామె. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నట్టుగా చిత్రీకరించటం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించిందనటంలో సందేహం లేదు.
జర్నలిస్ట్ ని చితకబాదిన మిగతా వాళ్ళెవరి మీదా ఏమీ పడలేదు కానీ కాన్ స్టేబుల్ తారక దాస్ మాత్రం సస్పెండ్ అయ్యాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more