ప్రముఖ ప్రపంచ క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఎ. పాల్ మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గతంలోనే నుండే రాజకీయాల్లో ఉన్నా అతడు గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతను మళ్ళీ రాజకీయ పున:ప్రవేశం చేయడమే కాకుండా మళ్ళీ ప్రజాశాంతి పార్టీని పునరుద్దరించాడు. గతంలో ఆయన ఇదే పేరుతో కొన్ని రోజులు పార్టీని నడిపించాడు. ఏమైందో ఏమో కానీ కొన్ని రోజులు రాజకీయాలకే దూరంగా ఉన్నాడు.తాజాగా మళ్ళీ అదే పార్టీని ఆవిర్భవించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని, నాయకులు స్వార్థ ప్రయోజనాలు కోసం పేద వర్గాల వారిని పీడించుకుతింటున్నారని పేదలు మరింత హీన స్థితికి దిగజారి పోతున్నారని అందుకోసమే ఈ పార్టీని మళ్ళీ ప్రారంభించినట్లు తెలిపారు.సమాజంలో మార్పు కోసం , అవినీతి లేని సమాజం కోసం , అందరు అధికార నినాదంతో రాష్ట్రాన్ని సౌభాగ్యాంధ్ర ప్రదేశ్ తీర్చిదిద్దడానికి తన పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఏ నిరుపేద, బడుగు బలహీన మైనారిటీ వర్గాల ఉన్నతి కోసం తాను చేస్తున్న కార్యక్రమాలను రాజకీయ అధికారంతో అడ్డుకున్నారో అదే రాజకీయ అధికారం సాధించి తన లక్ష్యం నెరవేరుస్తానన్నారు. 2014 ఎన్నికల్లో అన్నీ అసెంబ్లీ స్థానాల్లో తన పార్టీ పోటీచేస్తుందని కూడా ఆయన చెప్పారు. త్వరలో జరగబోయే రామచంద్రపురం ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ఆయన తెలిపారు.
మరి కే.ఏ. పాల్ గతంలో కాంగ్రెస్ కి దగ్గరవుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మొన్నటికి మొన్న హైదరాబద్ లోని తన సంస్థ గ్లోబల్ పీస్ మిషన్ లో ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి కపిల్ సిబల్ ని కూడా ఆహ్వానించాడు. దీంతో అందరు పాల్ కాంగ్రెస్ లో చేరుతాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పాల్ రాజకీయపార్టీ పెట్టడంతో అనేక సందేహాలు నెలకొన్నాయి.జగన్ ని రాజకీయంగా దెబ్బకొట్టడానికే గ్రెస్ పార్టే పాల్ తో మళ్ళీ పార్టీ పెట్టించిందని, వారి బలంతోనే పాల్ ఉప ఎన్నికల్లో పోటీకి సిధ్దం అయ్యాడని కూడా అంటున్నారు,. మరి కాంగ్రెస్, పాల్ పార్టీలు కలిసి జగన్ ని ఏ మేరకు కంట్రోల్ చేస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more