ఈసారి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇంతవరకూ వార్తా విక్రయాల కేసుల్లో ఎన్నికల కమిషన్ 167 నోటీసులను జారీచేసింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమకు అనుకూలమైన వార్తలను ప్రచురించటం కోసం వివిధ వార్తా పత్రికలకూ ముడుపులు చెల్లించిన కేసుల్లో పంజాబ్ 129 నోటీసులతో అగ్ర స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ లో 38 నోటీసులు జారీ అయ్యాయి. మణిపూర్, ఉత్తర్ ఖండ్ లలో ఇటువంటి కేసులేమీ ఇసి దృష్టికి రాలేదు.
అయితే ఈ లెక్కలు వాస్తవాలకు అద్దం పట్టేవేమీ కావు. బయట పడకుండా జాగ్రత్త పడ్డవారుండవచ్చు. ముడుపులు చెల్లించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అవన్నీ బయటకురావు. వచ్చినవాటిలో కూడా ఇసి ఒక నిర్ణయం తీసుకునే ముందు సదరు అభ్యర్థల వివరణను కోరుతుంది. ఎన్నికైన అభ్యర్థిని కూడా కోడ్ ఉల్లంఘన కేసులో అతని ఎన్నిక పనికిరాదని ఒక్కసారి పెద్ద నాయకుడి మీద వేటు పడితే ఇలాంటివన్నీ అణిగిపోతాయి కానీ ఇంతవరకూ అటువంటిదేమీ జరగలేదు. నోటీసులు నోటీసులే చేసే పనులు చేసేవే. తీరా ఎన్నికైన ఆ అభ్యర్థిని తర్వాత అనర్హులుగా ప్రకటించే ఆనవాయితీ ఇంతవరకూ లేదు. ప్రచారం సమయం ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేసిన సందర్భాలలో ఇసి దృష్టికి వెళ్ళినవే ఎన్నో ఉన్నాయి. కానీ దాని వలన వాళ్ళకెటువంటి నష్టమూ కలగలేదు.
ఎన్నికల సమయంలో ఇసి కి భయపడుతున్నట్టే ఉంటారు కానీ బాహాటంగా ఇసిని సవాలు చేసిన వారిమీద కూడా ఎటువంటి చర్యలూ ఇంతవరకూ తీసుకోలేదు. అటువంటి వారు అభ్యర్థులు కాకపోయినా, ఏ అభ్యర్థి కోసం ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారో ఆ అభ్యర్థిని కూడా ఆ తప్పిదంలో భాగం స్వామ్యం చేస్తే కానీ ఉల్లంఘనలు ఆగిపోవు. పార్టీ గెలుపుని ప్రకటించిన తర్వాత కోలాహలం, విజయోత్సవాలు, ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి కానీ అంతకు ముందు ఎన్నికల సమయంలో చేసినవన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి. ఎన్నికలవగానే ఎన్నికల కమిషన్ పని పూర్తయిపోవటమే అందుకు కారణం. అభ్యర్థుల మీద అభియోగాలన్నీ పూర్తయ్యేంత వరకూ వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటించకుండా ఉండగలిగితే ఎన్నికల అధికారుల మాట పూర్తిగా వింటారు.
2007 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తనకి అనుకూలంగా వార్తలను పత్రికల్లో వేయించుకున్న బిసౌలీ శాసన సభ్యుడు ఉమ్లేష్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని అక్టోబర్ 2011 లో ఇసి రద్దు చేసారు. దీనికే పొంగిపోతున్న ఇసి అధికారులు, భవిష్యత్తులో కోడ్ ఉల్లంఘించే వారికి ఇది గుణపాఠమౌతుందని ఆనందపడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more