పోరుయాత్రల సీజన్ లో నేనేం తీసిపోయానంటూ కిషన్ రెడ్డి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మొదటిసారిగా స్వతంత్ర రాజకీయ కార్యక్రమంగా తెలంగాణా పోరుయాత్ర పేరుతో మహబూబ్ నగర్ నుంచి తలపెట్టింది. పాదయాత్రలకూ, పోరు యాత్రలకూ ఒక లక్ష్యమంటూ ఉండాలి కాబట్టి గత కొద్ది నెలలుగా చల్లారుతూ వస్తున్న ప్రత్యేక తెలంగాణా ప్రధానాంశంగా మరోసారి లేవనెత్తి, ప్రజలలోకి వెళ్తున్నారు. పనిలో పనిగా ఈ యాత్రలో, రాబోయే ఎన్నికలకోసం అభ్యర్థులను కూడా ఎంపికచెయ్యనున్నారని వార్త. ఎన్నికలింకా చాలా దూరంలో ఉన్నా, అన్ని పార్టీలూ ఆ ఎన్నికల మీద దృష్టి పెట్టినప్పుడు భాజపా మాత్రం ఎందుకు వెనకబడివుంటుంది. ఏదో ఒక కార్యక్రమం వేసుకుని పర్యటించాలనే తపన పాలకపక్షం సహా ప్రతి పార్టీ లోనూ కనపడుతోంది.
ఈరోజు కిషన్ రెడ్డి కార్యక్రమం ఇలా ఉంటుంది. కృష్ణ గ్రామం నుంచి బయలుదేరే ఈ యాత్ర 12 గంటల ప్రాంతంలో మక్తల్ చేరుకుని అక్కడ బహిరంగ సభకు హాజరవుతారు. అందులో భాజపా జాతీయ అధ్యక్షడు నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా జరిగే బహిరంగ సభలో యాత్రను లాంఛనప్రాయంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మద్దతునిస్తున్న తెలంగాణా ఐకాస నుంచి ఇతర తెలంగాణా వాదులలోంచి నాయకులు హాజరవుతారు.
మొత్తం 22 రోజులపాటు సాగే ఈ యాత్రలో కిషన్ రెడ్డి 3600 కిలోమీటర్లను కవర్ చేస్తున్నారు. మూడు రోజులు మహబూబ్ నగర్ లో పర్యటన చేసి, ఆ తర్వాత రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీం నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను చుట్టివచ్చి, చివరకు భద్రాచలంలో యాత్రను ముగిస్తారు. ఫిబ్రవరి 11 న హైద్రాబాద్ లో బహిరంగ సభలో ఈ మొత్తం కార్యక్రమం ముగింపు లాంఛనంగా జరుగుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more