Opposition asks judges bill to be withdrawn

opposition asks judges bill to be withdrawn, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

opposition asks judges bill to be withdrawn, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

judges-bill-1.gif

Posted: 12/28/2011 04:56 PM IST
Opposition asks judges bill to be withdrawn

పార్లమెంటులో ఆమోదంకోసం చాలా కాలంగా వేచిచూస్తున్న బిల్లు జ్యడిషియల్ స్టాండర్డ్స్ అండ్ ఎకౌంటబిలిటీ బిల్లు. అక్టోబర్ 2010లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుని పార్లమెంటు స్టాండింగ్ కమిషన్ కి పంపగా 2011 ఆగస్ట్ లో స్టాండింగ్ కమిటీ తనదైన కొన్ని సూచనలతో ముందుకొచ్చింది.

సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల మీద అభియోగాలను విచారించి, అవసరమనుకుంటే వారిని తొలగించేందుకు అవసరమైన యంత్రాంగం చాలా అవసరమని లోక్ సభ సభ్యులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని కేంద్ర న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.

తాజా బిల్లులో పాత జడ్జెస్ ఎన్కవైరీ యాక్ట 1968ని రద్దు చేస్తూ అందులోని హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే అధికారాలను పార్లమెంటుకి ఉన్నటువంటి కొన్ని కీలకమైన అంశాలను మాత్రం తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది.

కానీ ఈ కొత్త ప్రతిపాదనలు కూడా చాలవని, అందువలన మరోసారి దీన్ని పరిశీలించవలసిందని భాజపా నేత చంద్రెగౌడ అనగా, కాంగ్రెస్ పార్టీ నేత మనిష్ తివారీ దాన్ని సమర్థిస్తూ, సుప్రీం కోర్టు, 21 హైకోర్టుల జడ్జీల నియామకం, బదిలీల విషయంలో కూడా పునరాలోచన చెయ్యాలన్నారు. ఆమధ్య కోలకతా హైకోర్టు జడ్జ్ సౌమిత్ర సేన్ కేసులో అభియోగాలున్న ఆయన్ని తొలగించటానికి ప్రభుత్వం నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఈ విషయంలో మాట్లాడుతూ, మనదేశ 64 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్క ఇంపీచ్ మెంటు కేసు వచ్చింది అది కూడా సగమే జరిగిందని మనీష్ తివారీ అన్నారు.

ఈ మధ్య కాలంలో ప్రభుత్వ చర్యల మీద, రాజకీయ నాయకుల మీద కూడా జడ్జ్ లు రకరకాలుగా వ్యాఖ్యానాలు చెయ్యటం ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, వారిని కోర్టులో ప్రాతినిధ్యం వహించే న్యాయశాఖలోని వారికి కూడా నచ్చటం లేదు. స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలో ఈ ప్రస్తావన ఉంది. జడ్జ్ లు అనవసరమైన వ్యాఖ్యానాలు చెయ్యరాదని సూచించింది. జడ్జిలు గా వ్యవహరిస్తున్న కాలంలో అదే కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు, స్నేహాలు, కలిసి తిరగటాలు పెట్టుకోగూడదని కూడా సూచన ఉంది. మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే, కోర్టులో జరిగే విచారణలను వీడియో తియ్యటం వలన ఆ జడ్జ్ లమీద అభియోగమేదైనా ఉంటే దాన్ని పరిశీలించటానికి తోడ్పడుతుందని.

జడ్జీల నియామకంలో రిజర్వేషన్ ని పాటించాలని సమాజవాది పార్టీ, బహుజన సమాజవాది పార్టీ, జనతాదళ్ యు లు కోరుతున్నాయి. ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్ ఉండాలని, చాలా కేసుల్లో ఇటువంటి వారి కేసులు అనవసరంగా జాప్యం చోటుచేసుకుంటున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. అసలు వారి నియామక సమయంలో సరైన విచారణ జరగాలని, జడ్జ్ ల నియామకం కూడా ఐఏఎస్ లాగా గట్టి పరీక్షలతో జరగాలని బిఎస్ పి నేత విజయ బహదూర్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలియజేసారు. జడ్జ్ ల పదవీ విరమణను సుప్రీం కోర్టుకీ హైకోర్టులకూ సమానంగా చెయ్యాలని కొందరు సూచించారు. పోయినసారి రిటైర్ మెంటు వయసుని 60 నుంచి 62 కి పెంచారు. ఇప్పుడు హైకోర్టు జడ్జ్ ల వయోపరిమితిని సుప్రీంకోర్టు జడ్జ్ లకు సమానంగా 65 కి పెంచాలని ప్రతిపాదన. ప్రస్తుతం 21 హైకోర్టులలో 604 మంది జడ్జిలు పనిచేస్తున్నారు. ఇంకా 291 ఖాళీలున్నాయి.

ఈ బిల్లులో ఇంకా ఎన్నో సవరణలు చేసి న్యాయశాఖలో సంపూర్ణమైన మరమ్మత్తులు అవసరమని, అందువలన ఈ బిల్లుని తిరిగి వెనక్కి పంపించమని బహదూర్ సింగ్ అనగా సభలో అన్నివైపుల నుంచీ హర్షధ్వనులు బెంచీలమీద చప్పుళ్ళ రూపంలో వినిపించాయి.

అయితే, జెడి యు కి చెందిన అర్జున్ రాయ్ మాత్రం, లోక్ పాల్ కి సిబిఐని కట్టబెట్టకుండా కాపాడుకున్న ప్రభుత్వం ఇప్పుడు న్యాయవిభాగాన్ని కూడా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ఇక మిగిలింది ఎన్నికల కమిషనే. దాన్ని కూడా తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకుంటే ఇక రాజకీయ నాయకులు ఆడింది ఆట పాడింది పాట అని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  11 fishermen caught in thoni toofan
Motkupally complains against kcr motive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles