తెలంగాణా ఉద్యమానికి మద్దతునిస్తూ అధికారుల ఆగ్రహానికి గురై చివరకు రాజీనామా చేసిన డిఎస్పీ నళిని ఈ రోజు ఐదు రోజులపాటు తెలంగాణా ప్రాంతంలో పర్యటించటానికి బస్సు యాత్ర ప్రారంభించారు. ఎల్బినగర్ శ్రీకాంతా చారి చౌరస్తా నుంచి ప్రారంభమైన అమరవీరుల కుటుంబాల స్పూర్తి బస్ యాత్రగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ లాంఛనంగా ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, నాగం జనార్దన్ రెడ్డి, చుక్కారామయ్య, దత్తాత్రేయ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో మొదలై సాగే ఈ బస్సు యాత్ర తెలంగాణా జిల్లాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరచటానికి పూనుకుంటుందని నళిని తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more