విశాఖ పట్టణంలో ఉన్న 77 అడుగుల బాల గణేషుడు నిమజ్జనం చేశారు. ఉన్న చోటే నిమజ్జనం చేయడం విశేషం. చివరి రోజు పార్వతీ తనయుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేలం పాటలో లడ్డూను మంత్రి గంటా శ్రీనివాసరావు దక్కించుకున్నారు. గాజువాక లంకా మైదానంలో వినాయకుడు 21 రోజులుగా పూజలందుకున్నాడు. 77 అడుగుల భారీ విగ్రహాన్ని భారీగానే భక్తులు దర్శించుకున్నారు. ఈ ప్రాంత సుఖ సంతోషాల కోసమే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
అక్కడనే నిమజ్జనం ఎలా చేశారు.
ఓ వైపు భారీ విగ్రహం..అక్కడనే నిమజ్జనం ఎలా చేస్తారన్న ఆసక్తి అందరిలో కలిగింది. ఆ సమయంలో ఫైర్ ఇంజన్లు తెప్పించారు. దానితో విగ్రహాన్ని అక్కడనే నిమజ్జనం చేశారు. అంతకుముందే 77 కిలోల లడ్డూను వేలం వేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వేలం పాటలో ఫోన్ ద్వారా పాల్గొన్నారు. 3లక్షల 77వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ప్రసాదాన్ని అక్కడనే భక్తులకు పంచిపెట్టారు. వినాయకుడికి ఉపయోగించని మట్టిని అనాకపల్లి దగ్గరలోని శారదానదిలో కలిపారు.
సబ్బం దూరం
జగన్ నా మాటే..నా బాట అంటూ వచ్చిన అనకాపల్లి ఎంపీ రూట్ మార్చుకున్నారా ? వైసీపీతో బాటే ఉన్న సబ్బం హరి ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నారా ? వైసీపీ సభ్యులే ఆయన్ను ఎందుకు దూరం పెడుతున్నారు ? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై అభిమానం చంపుకోలేక కొంతమంది వైసీపీ పార్టీకి మద్దతిచ్చి పార్టీలో చేరారు. కాని కాలం గడుస్తున్నా కొద్దీ కొంతమంది ఆ పార్టీ నుండి తప్పుకుంటున్నారు. తాజాగా సబ్బం హరి కూడా చేరారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్ పార్టీకి సబ్బం హరి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. జగన్ విడుదలకుముందే జైల్లో ములాఖత్ అయ్యారు. 2014ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని సబ్బం హరి ముందే ప్రకటించుకున్నారు.
కాని పరిస్థితి రివర్స్ అయ్యింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారంటూ వైసీపీ సబ్బం హరిని దూరం పెట్టింది. ఆయన్ను పార్టీలోకి తీసుకునే ఛాన్స్ లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో జగన్ దోస్తీ చేయనున్నట్లు సబ్బం హరి చెప్పారని వైసీపీ ప్రధాన ఆరోపణ చేస్తోంది. దీనివల్ల పార్టీకి తీరని నష్టం జరిగిందని నేతలు పేర్కొంటున్నారు.ఇప్పటికే విశాఖ జిల్లాలో అంతర్గత విబేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాడి వీరభద్రరావు రాకతో విబేధాలు రచ్చకెక్కాయి. జిల్లాలో నాయకులు ఎక్కువ కావడంతో ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయి. కొంతమందిని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం ఉంది. ఈ పరిణామాలు పార్టీలో ఎంత వరకు మార్పులు తీసుకొస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more