ఈరోజు కేంద్రమంత్రి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి గంటా శ్రీనవాసరావు కేక్ కట్ చేయటం జరిగింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేవరకు తమ సమైక్య పోరాటం ఆగదని రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోరాటంలో భాగంగా గంగవరం పోర్టు కార్యాకలాపాలను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. గంటా ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. అలాగే విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది.
కలెక్టర్ రిలీవ్ అయ్యారు
కలెక్టర్ శేషాద్రి విదుల నుంచి ఆకస్మికంగా రిలీవ్ అయ్యారు. బాద్యతలను సంయుక్త కలెక్టరు ప్రవీణ్ కుమార్ కు అప్పగించి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో విధుల్లో చేరడానికికే హుటాహుటిన వెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి సమైక్యాంద్ర ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు కలెక్టరు శేషాద్రిని కొనసాగిస్తారని అంతా భావించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం నుంచి పిలుపురావడంతో ఒక్క రోజులోనే మార్పులు వచ్చాయి. శేషాద్రి సాయంత్రం విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది తాజాగా జేసీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన పనితీరు కఠినం
శేషాద్రి తీరుసౌమ్యంగా ఉన్నప్పటికి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. ప్రజలకు సేవ చేయాలనే భావన కనిపించింది. పేదలపై సేవాభావం ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. ప్రతివారం జనంతోనే ఎక్కువుగా మమేకమై మంచి కలెక్టరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. పేదలు, ప్రజల పట్ల అధికారులు, జిల్లా యంత్రాంగంలో సిబ్బంది ఎవరైనా కొంచెం నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణించేవారు. అప్పటివరకు సౌమ్యంగా కనిపించే శేషాద్రి గట్టిగా అరిచి చెప్పకపోయినా కఠినంగా మాత్రం అధికారులకు ఆదేశించే వారు నిర్లక్ష్యం వహించే అధికారుల పట్ల కఠినంగానే వ్యవహరించేవారు. విదుల నుంచి రిలీవ్ అయ్యే ముందు వరకు ఒక వివాదాస్పద అధికారికి వత్తాసు పలికారు అనే అపవాదు మూటకట్టుకున్నారు. ఇది మినహా ఆయన తీరుపై ఎక్కడా విమర్శలు రాలేదు.ఇచ్చిన లక్షాలను చేరని అధికారుల పట్ల కొంచెం మందలింపుగానే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 29న బాధ్యతలు కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన శేషాద్రి ఏడాది కాలంలో తనదైన ముద్ర వేసుకోగలిగారు. ఎన్ని ఓత్తిళ్లు వచ్చినా పట్టించుకోకుండా ముందడుగు వేశారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more