సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరినప్పుడు, ఆ ముక్కంటి వరలక్ష్మీ వ్రతాన్ని గురించి చెప్పినట్లు శాస్త్రాలు వెల్లడించాయి. స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన 'నోములు - వ్రతాలు'లో ముందుగా 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' గురించి తెలుసుకుందాం.
సంపద వుంటే సగం సమస్యలు దూరమైనట్టే. అలాంటి సంపద లభించాలంటే సకల సంపదలకు పుట్టినిల్లు అయిన 'శ్రీ వరలక్ష్మీ దేవి' అనుగ్రహం ఉండాలి. అందుకోసం 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి పీఠంపై అమ్మవారి ప్రతిమను ... కలశాన్ని పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక ఆచమనం చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కరించాలి. గణపతి ప్రార్ధన ... ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధన చేసి ... అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి.
అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి అర్ఘ్య పాద్యాలను ఇవ్వాలి. ఆ తరువాత పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి .. శుద్ధోదక స్నానం చేయించి వస్త్రాభరణాలు .. పసుపు కుంకుమలు .. పూలు .. గంధం .. అక్షితలు సమర్పించాలి. ఆ తరువాత వరలక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి.
ఈ వ్రతం యొక్క కథ :
ఈ వ్రతం ఆచరించడానికి అవసరమైన ఈ కథను చెప్పుకోవాలి. పూర్వం మగధదేశంలోని ఓ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 'చారుమతి'అనే ఇల్లాలు వుండేది. ఆమె వరలక్ష్మీ దేవి భక్తురాలు. భర్త మనసెరిగి నడచుకోవడమే కాకుండా, అత్తమామలను తల్లిదండ్రులవలే ఆదరిస్తూ వుండేది. నిరంతరం ఇంటి పనుల్లో నిమగ్నమవుతూనే, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉండేది. చారుమతి వినయ విధేయతలు ... భక్తి ప్రపత్తులకు మెచ్చిన వరలక్ష్మీ దేవి కలలో కనిపించి ఆమెపట్ల తనకి గల అనుగ్రహాన్ని తెలియజేసింది. 'శ్రావణ పౌర్ణమి'కి ముందు వచ్చు 'శుక్రవారం' తన వ్రతమును ఆచరించించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పింది. మరునాటి ఉదయం తనకి వచ్చిన కల గురించి చారుమతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లంతా కూడా అమ్మవారు చెప్పినట్టుగా చేయమని ఆమెను ప్రోత్సాహించారు. దాంతో చారుమతి తమ ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆ రోజున అందరూ రావాలని ఆహ్వానించింది. 'శ్రావణ శుక్రవారం'రోజున అంతా చారుమతి ఇంటికి చేరుకున్నారు.
అప్పటికే ఆమె అమ్మవారి కోసం పీఠాన్ని సిద్ధం చేసి దానిపై కలశాన్ని ఉంచింది. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి ... తొమ్మిది పోగుల తోరమును ధరించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. దాంతో ఆమెతో పాటు మిగతా వారు కూడా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు. అలా వాళ్లు ఒక్కో ప్రదక్షిణ చేస్తుండగా వాళ్ల ఇళ్లలో సిరిసంపదలు పెరిగిపోసాగాయి. మూడు ప్రదక్షిణలు పూర్తి కాగానే వాళ్లందరి ఇళ్లు ధన కనక వస్తువులతో నిండిపోయాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన వీళ్లంతా, ప్రతి ఏడాది చారుమతి చేసిన తరహాలోనే వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ వ్రతం చేసినా .. చూసినా .. కనీసం విన్నా .. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 25 | దేవ్యువాచ :దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక!అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతఃఈశ్వర ఉవాచ :దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం... Read more
Jun 16 | పూర్వం శ్రీ కృష్ణుని కుమారుడు అయిన సాంబుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ సూర్యస్తోత్రమును పఠించాడు. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. 1. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవఃహృద్రోగం మమ... Read more
Jun 10 | 1. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయకర్పూరకాన్తి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 2. గౌరిప్రియాయ రజనీశ కళాధరాయకాలాన్తకాయ భుజగాధిప కంకణాయగంగాధరాయ గజరాజ విమర్ధనాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 3. భక్తప్రియాయ భవరోగ భయాపహాయఉగ్రాయ దుఃఖ... Read more
May 07 | బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం 1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ 2. త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైఃతవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ 3.... Read more
Apr 25 | ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం... Read more