దసరా పర్వదినాన్ని రోజున త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రావణున్ని సంహరించి.. లంకాధిపతిపై విజయాన్ని సాధించి.. అశోక వనంలో బంధీయై ఉన్న సీతమ్మను తనతో తీసుకుని తిరిగి తన అయోధ్యనగరమునకు పయనమైన రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ద్వాపర యుగంలోనూ పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ అస్త్రశస్త్రాలను అందుకున్న రోజుగానూ చెబుతారు. దీనికి తోడు మూడు జగ్గమ్ములలేను కనకదుర్గమ్మతల్లి లోకకళ్యాణం కోసం మహిషాసురుడను రాక్షసుడ్ని వధించి రోజుగా కూడా చెబుతున్నాయి.
ఈ రోజును విజయదశమిగా మనం ఆచరిస్తూ.. దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమాన్ని జరుపుతుంటారు. దేశమంతా వేడుకగా నిర్వహించే విషయం తెలిసిందే. దసరా రోజు సాయంత్రం దశకంఠుడిని శ్రీరాముల వారు తన బాణంతో వధించేలా పలు రకాలుగా.. ఆకర్షనీయంగా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. అలాగే నిన్నటి దసరా ఉత్సావాల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ముజాఫర్నగర్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తీరా రావణ దహణం జరుగుతున్న క్రమంలో.. బాణాసంచా రివర్స్లో పేలింది. రావణుడి భారీ దిష్టిబొమ్మకు నిప్పు అంటించిన సమయంలో.. ఆ రావణుడు రివర్స్లో రాకెట్లను ఫైర్ చేశాడు.
ముజఫర్నగర్లోని గవర్నర్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన వేడుకలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన జనంపై ఆ రావణాసురుడి నుంచి రాకెట్లు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న జనం పరుగులు తీశారు. భద్రత కోసం వచ్చిన పోలీసులు కూడా రావణాసురుడి రాకెట్ల నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టారు. దీనికి తోడు బాణా సంచా కాల్చడం ముగిసిన తర్వాత ఓ దున్నపోతు జనంలోకి దూసుకువచ్చి హంగామా చేసింది.
मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए pic.twitter.com/zuDmH3dKXa
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more