చట్టసభలకు ఎన్నికై.. శాసనసభ్యులుగా మారేందుకు ఆయా రాష్ట్రాల్లోని పలు పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. ఈ ఎన్నికలలో గెలిచేందుకు.. ప్రతీ ఒక్కరికీ చందమామను తెచ్చిస్తామని మొదలుకుని.. ప్రతీ పేద మహిళకు వజ్రాలు పొదిగిన బంగారు గాజులు చేయిస్తామని అసాధ్యమైన హామీలను సుసాధ్యమని నమ్మబలుకుతూ మాటల గారడీ చేస్తారు అబ్యర్థులు. అన్ని చేసి ఎట్టకేలకు శాసనసభలోకి వెళ్లిన తరువాత తాము ఎన్నికైన పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. ఒక్కోసారి అభ్యర్థిని కాకుండా పార్టీని చూసి ఓటు వేసిన ప్రజలకు.. ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లే ఘటనలు కూడా జరుగుతుంటాయి.
ఇక ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ ప్రాంత సమస్యల గురించి మాట్లాడి వాటికి పరిష్కారాలు కనుగొంటారా.? అంటే ఎందుకోచ్చిన కంఠశోశ.. కావాల్సిన కార్యం గంధర్వులు తీర్చగా అంటున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో అక్కడి ఎమ్మెల్యేలు ఎంత బిజీగా మారారో చూడండీ. ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశాలను పట్టించుకోకుండా తమదైన పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే వీడియో గేమ్స్ ఆడటంలో బిజీ అయ్యారు. మరో బీజేపీ ఎమ్మెల్యే సభలోనే పొగాకు డబ్బా తీసి నోట్లో వేసుకున్నారు.
యూపీలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఈ వీడియోలను ట్విట్టర్లో షేర్ చేసింది. ‘ఈ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. ఎస్పీ పోస్ట్ చేసిన ఒక వీడియోలో మహోబా ఎమ్మెల్యే రాకేష్ గోస్వామి ట్యాబ్లో కార్డ్ గేమ్ ఆడుతూ కనిపించారు. ఝాన్సీ ఎమ్మెల్యే రవిశర్మ అసెంబ్లీలో కూర్చొని పొగాకు నమిలారు. ఈ వీడియోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ పార్టీ సీఎం ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. ‘ఈ వ్యక్తుల వద్ద ప్రజా సమస్యలకు సమాధానాలు లేవు. అసెంబ్లీని వినోద కేంద్రంగా మార్చారు. చాలా అసహ్యకరం, అవమానకరం’ అని ఎస్పీ విమర్శించింది.
కాగా, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా దీనిపై ట్విట్టర్లో స్పందించారు. యూపీ విధానసభలో బీజేపీ ఎమ్మెల్యేలు పేకాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ వీడియోను రికార్డు చేసి వైరల్ చేయడం ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం పని చేసిన ఇతర బీజేపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ‘ఇప్పుడు సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఎమ్మెల్యేపై ‘మోరల్ బుల్డోజర్’ ఎప్పుడు నడుస్తుంది? అని ప్రశ్నించారు. మరోవైపు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक!
— Samajwadi Party (@samajwadiparty) September 24, 2022
महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे।
इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे।
बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more